
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని బాలేశ్వర్ వద్ద కారు బోల్తాపడింది. దీంతో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కేంద్రమైన బాలేశ్వర్ సమీపంలో జాతీయ రహదారిపై అదపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కిందపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






