
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న మౌనిక (27) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బొర్రెలగూడెం స్టేజీ వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.