అమెరికాలో జరుగుతున్న పోలింగ్ లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బైడెన్కు 215, ట్రంప్ నకు 164 ఎలక్టోరల్ ఓట్లు పడ్డాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు ఇప్పటి వరకు 379 ఫలితాలు వచ్చాయి. 270 ఓట్ల కన్నా అధికంగా వచ్చిన వారు విజయం సాధించి వైట్ హౌజ్ కు వెళ్తారు. ఓ వైపు పోలింగ్ జరుగుతూనే మరోవైపు లెక్కింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ పోటా పోటీగా ప్రచారం చేశారు. గెలుపుపై ఎవరి దీమా వారిదే అన్నట్లు ఉన్నారు.