spot_img
Homeజాతీయ వార్తలుషర్మిలకు ఆదిలోనే అడ్డంకులు..

షర్మిలకు ఆదిలోనే అడ్డంకులు..

YS Sharmila
వైఎస్ షర్మిలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయా..? ఏమో చెప్పలేం.. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితిని గమనిస్తుంటే.. అలాగే అనిపిస్తోంది. ఏప్రిల్ 9న షర్మిల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభలో పార్టీపేరు ప్రకటిస్తానని చెప్పింది. పార్టీ విధివిధానాలు నిర్ణయిస్తానని చెప్పింది. బహిరంగసభ కోసం పోలీసులు అనుమతి ఇచ్చారని కూడా అనుమతి వచ్చింది. సో.. ప్రభుత్వం పరంగా షర్మిలకు అడ్డంకులు లేవు.

అయితే ఆమె సభకు ఇబ్బందులు ఎదురవుతాయని అనుమానాలు రావడానికి కారణం తెలంగాణలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా. కేవలం తెలంగాణలోనే కాదు.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. ప్రధాన మంత్రి మోదీ కూడా ఈ మధ్య ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కరోనా నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు విధించారు. తెలంగాణలోనూ లాక్ డౌన్ విధిస్తారేమోననే అనుమానం వ్యక్తం అవుతోంది.

Also Read: మళ్లీ లాక్ డౌన్..?

ఇప్పటికే పొరుగున ఉన్న మహారాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఇంకా అనేక రాష్ట్రాల్లోనూ కరోనా నివారణకు ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే సీఎంలు కరోనా వ్యాప్తిని అరికట్టాలని సలహా ఇచ్చారు. వాస్తవానికి ఈనెల 22 నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పునరాలోచనలో పడింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తాను రాజకీయ అరంగేట్రం చేయాలన్న ఆలోచనతో ఉన్న షర్మిలకు ఉన్న అడ్డంకులు కలుగుతాయా..? ఒకవేళ కేసులు పెరిగిన పక్షంలో ప్రభుత్వం నిబంధనలు విధించే అవకాశం ఉంది. ఆ పరిస్థితి వస్తే.. మరికొంతకాలం ఆగాల్సి వస్తుంది. ఇప్పటికే బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలని జిల్లా నాయకులతో పలుమార్లు చర్చించింది షర్మిల.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper