
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోవును వధించిన వారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ యోగి ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. గోవును వధించిన వారికి మొదటిసారి నేరం చేస్తే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించాలని యూపీ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేసింది.
గోవును రెండోసారి వధిస్తే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించాలని సర్కారు నిర్ణయించింది. గో వధ నివారణ చట్టం 2020 పేరిట యూపీలోని యోగిఆదిత్యనాథ్ సర్కారు ఈ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. యూపీ సర్కారు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించారు.