spot_img
Homeజాతీయ వార్తలుబీజేపీ విభజన పాలి‘ట్రిక్స్‌’ నడిపిస్తోందా..?

బీజేపీ విభజన పాలి‘ట్రిక్స్‌’ నడిపిస్తోందా..?

BJP
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా రాష్ట్రాలను కలుపుకొని పోయి పాలన నడిపిస్తుండాలి. కానీ.. ఇప్పుడున్న బీజేపీ మాత్రం విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఉద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు చేస్తోంది. కేవలం దక్షిణాది ప్రజల్లో సమస్యలపై స్పందించే లక్షణం ఎక్కువ అంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేరళలో జరిగిన ఓ బహిరంగసభలో వ్యాఖ్యానించారు. ఇది ఉత్తరాదిని అవమానించడమేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. ప్రస్తుతం కేరళ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ అక్కడ తరచూ పర్యటిస్తున్నారు. మొన్నటి పర్యటనలో తాను ఉత్తరాదిలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను.. కేరళలో ఎంపీగా తను అనుభవాలను వివరించారు.

Also Read: పటేల్‌ స్టేడియానికి మోడీ పేరు : రాజకీయ దుమారం

దీనిని పోల్చి చూడటం బీజేపీ నేతలకు మంచి అవకాశంగా మారింది. ఆయన ఉత్తరాదిని అవమానించారంటూ విమర్శలు ప్రారంభించారు. హిందీ మీడియా మొత్తం బీజేపీ అనుకూలమే కావడంతోవారికి అనుకూలంగా చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రకరకాలుగా విశ్లేషణలు చేశారు. అయితే.. అసలు రాహుల్ గాంధీ అన్నదాంట్లో వివాదాస్పదం ఏముందో ఎవరూ చెప్పలేకపోయారు. ఉత్తరాది కన్నా.. దక్షిణాది ప్రజల సమస్యలపై స్పందించే గుణం ఎక్కువ ఆయన ప్రధానంగా చెప్పారు. ఇది ఉత్తరాదిని కించ పర్చడం ఎలా అవుతుందో బీజేపీ నేతలకే తెలియాలి.

Also Read: ‘ప్రైవేటీకరణపై’ బయటపడ్డ మోడీ.. అంతా షాక్

రాజకీయాలు.. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం.. ఉత్తరాది, దక్షిణాది తేడాలు చూపించడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం ఇక్కడి ప్రజలలో బలపడేలా.. కేంద్రం పాలన ఉంది. కీలకమైన ప్రాజెక్టులేవీ.. దక్షిణాదికి దక్కడం లేదు. కానీ పన్నుల్లో వాటాలు మాత్రం అత్యధికం దక్షిణాది నుంచే వెళ్తున్నాయి. అందుకే.. బీజేపీ రాజకీయం చేస్తున్న తీరు ప్రమాదకరం అన్న సంకేతాలు వెళ్తున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

అందుకే.. సందర్భం వచ్చినప్పుడల్లా దక్షిణాది సీఎంలు మాట్లాడుతూనే ఉన్నారు. టాక్స్‌లు ఇక్కడి నుంచే ఎక్కువ మొత్తంలో వెళ్తున్నా తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మొత్తుకుంటూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో దక్షిణాది సీఎంలు ఏకమై పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ వ్యత్యాసం భారీగా కనిపించింది. కానీ.. చివరకు ఏమైందో ఏమో కానీ సీఎంలు వెనక్కి తగ్గారు. లేదంటే ఇప్పటికి ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చే అవకాశమే ఉండేది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper