spot_img
Homeజాతీయ వార్తలుPaddy Grain Procurement: వరిధాన్యం కొనుగోళ్ల వివాదంలో తప్పెవరిది..? కేంద్రానిదా..? రాష్ట్రానిదా..?

Paddy Grain Procurement: వరిధాన్యం కొనుగోళ్ల వివాదంలో తప్పెవరిది..? కేంద్రానిదా..? రాష్ట్రానిదా..?

Paddy Grain Procurement: తెలంగాణ రోడ్లపై,కల్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి యాసంగి పంట మొదలు పెట్టే రైతులు వానకాలం పంటను ఇంకా అమ్ముకోలేదు. అందుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులే కారణం. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మెలికలు పెడుతోందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు. వానకాలం పంటను ఎలాగైనా కొంటామని, అయితే యాసంగి పంటను కొనుగోళ్లు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. అయితే యాసంగి పరిస్థితిని పక్కనబెడితే వానకాలం పంటను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు జరిపినా తేమ పేరుతో కిలోల లెక్కన కటింగ్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

Paddy Grain Procurement
Paddy Grain Procurement

వానకాలం పంటను కొటామని రాష్ట్రప్రభుత్వం తెలిపింది. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను 6000 నుంచి 6300 వరకు పెంచామని అంటోంది. అయితే ప్రస్తుతానికి 4500 కేంద్రాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఏటా అక్టోబర్ ముగిసే వరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ధ నుంచి ధాన్యాన్ని కొంటారు. కానీ ఈసారి డిసెంబర్ మొదటి వారం వచ్చినా ఇంకా ధాన్యొ కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం తేమతో మొలకెత్తుతోంది. ఇందుకు తోడు అకాల వర్షాలతో పంట ధాన్యం తడిసిపోతుంది. కాగా కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా 17 శాతం కంటే తేమ ఎక్కువగా వాటిని కొనుగోలు చేయడం లేదు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మెలిక పెడుతోందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. దేశంలో ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యాక్షన్ ప్లాన్ వేస్తోంది. ఈసంవత్సరం 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని తెలిపింది. అయితే ఏ ఏడాది తెలంగాణలో అనుకున్న దానికంటే ధాన్యం ఉత్పత్తి పెరిగింది. సుమారు కోటి లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పడింది. అందులో 58 లక్షలు కేంద్రం కొనుగోలు చేసినా మిగతాది రైస్ మిల్లర్స్ కు 20 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వగా.. మిగిలిన ధాన్యాన్ని రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. అయితే 2020-21 లో కోటి 41 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని సీఎం కేసీఆర్ ఇటీవల తెలిపారు.

Also Read: Minimum Support Price Act : కనీస మద్దతుధర చట్టంపై ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు.. రైతుల డిమాండ్ ఏమిటి..?

వాస్తవానికి తెలంగాణ జనాభా అవసరాలకు పంట నష్టం తదితర అవసరాలకు 25 లక్షల మెట్రిక్ టన్నులు సరిపోతుంది. ఎఫ్ సీఐ కి 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తే మొత్తంగా 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు పండించాలి. కానీ ఈసారి తెలంగాణలో దాదాపు కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పండింది. అంటే 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి అయింది. దీంతో మిగిలిన పంట కొనుగోలుపై కేంద్ర, రాష్ట్రాల మధ్య వైరుద్యం దానిని ఏం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వాలు తలమునకలవుతున్నాయి.

అయితే ప్రతి వరి ధాన్యం గింజ కొంటామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటనలు చేశారు. మరోవైపు సాగునీరు పుష్కలంగా అందించి వరి పంటను ప్రోత్సహించారు. దీంతో రైతులు వరి పంటను ఎక్కువగా వేశారు. కానీ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న యుద్ధంతో రైతులు నష్టపోతున్నారని అంటున్నారు. అయితే ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందిన తరువాత కేసీఆర్ ఇలాంటి రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. కేంద్రం కొనుగోలు చేయనప్పుడు ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.

Also Read: KCR: కేసీఆర్ కొత్త వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper