భారత్లో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 148 కి చేరుకుంది. ఇందులో 123 మంది భారతీయులు కాగా 25 మంది విదేశీయులు ఉన్నారు. ఇక దీని భారిన పడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇక ఈ కరోనా వైరస్ ఎక్కువుగా ఏ బ్లడ్ గ్రూప్ వారిపై అధికంగా ప్రభావం చూపుతుందనే విషయాన్నీ చైనాలోని జిన్విన్తాన్ ఆసుపత్రి వైద్యులు కనుకొన్నారు. వీరి పరిశోధనల్లో A బ్లడ్ గ్రూప్ వారికి వైరస్ త్వరగా వస్తుందని.. అలాగే O బ్లడ్ గ్రూప్ వారిపై కాస్త నెమ్మదిగా ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఇక మిగిలిన బ్లడ్ గ్రూప్ ల వారిపై చాలా తక్కువ ప్రభావం చూపుతుందని తేల్చారు. ఇక 2173 మందిపై చైనాలోని వుహాన్ నగరంలో ఈ పరిశోధన చేశారట.