Homeజాతీయ వార్తలుPM Modi: తగ్గేదేలే.. మోడీకి ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది?

PM Modi: తగ్గేదేలే.. మోడీకి ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది?

PM Modi: అగ్రరాజ్యానికి కోపం వస్తే చాలు ఒకప్పుడు ఇండియా ఇబ్బంది పడేది. అగ్రరాజ్యం ఇబ్బంది పడకుండా నడుచుకునేది. తన ఇబ్బంది పడినప్పటికీ అగ్రరాజ్యానికి ఏమీ కాకుండా చూసుకునేది. శ్వేత దేశం నుంచి అధ్యక్షుడు లేదా ఆ స్థాయి వ్యక్తులు వస్తే ఇండియాలో ఒక రకమైన వాతావరణం నెలకొనేది. అధ్యక్షుడి సేవలో తరించేందుకు మన దేశ వ్యవస్థలు పోటీపడేవి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి.. ఇతర మంత్రులు వంగి వంగి సలాం చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అగ్రరాజ్యం అంటే సులభంగా తీసుకునే స్థాయికి భారత్ వచ్చేసింది.

Also Read: సుగాలి ప్రీతి కేసులో ఏపీ సర్కార్ డేరింగ్ స్టెప్.. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా?

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అగ్రరాజ్యం విధివిధానాలలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వాణిజ్యం విషయంలో ట్రంప్ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత్ అంటే చాలు మండిపడుతున్నారు. టారిఫ్ ల శాతాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మొదట్లో అమెరికా తీసుకుంటున్న నిర్ణయం వల్ల మనదేశంలో ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తింది. అగ్రరాజ్యం విధిస్తున్న షరతులను భారత్ ఎలా తట్టుకుంటుంది అనే అనుమానం అందరిలోనూ మొదలైంది. అయినప్పటికీ భారత్ 7.8% వృద్ధిరేటును నమోదు చేయడం విశేషం. ఇదే విషయాన్ని సగర్వంగా భారత ప్రధాని ప్రపంచ వేదికల ముందు చెప్పడం గమనార్హం.. సెమికాన్ ఇండియా 2025 సదస్సులో భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశంగా మారిపోయాయి. గ్లోబల్ పరంగా చూసుకుంటే ఒక రకమైన వాతావరణం ఉంది. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఉత్పత్తి కూడా పడిపోయింది. నిరుద్యోగం తారస్థాయికి చేరుకుంది. ఇలాంటి స్థితిలో భారత్ సూపర్ వృద్ధిరేటును నమోదు చేయడం గొప్ప విషయమని భారత ప్రధాని పేర్కొన్నారు. కొంతమంది విచ్ఛిన్నకారులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ భారత్ స్థిరంగా నిలబడిందని ప్రధానమంత్రి కొనియాడారు.

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మైక్రో ప్రాసెసర్ చిప్ లను తయారుచేసి భారతదేశం ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. భారతదేశం విక్రం 32 బిట్ ప్రాసెసర్, 4 చిప్స్ తయారు చేసింది. ఇది తొలి మైక్రో ప్రాసెసర్ చిప్.. దీనిని ఇస్రో సెమీ కండక్టర్ ల్యాబ్ డెవలప్ చేసింది.. వాహక నౌకల్లో.. కఠినమైన పరిస్థితుల్లో పనిచేసే విధంగా దీనిని రూపొందించారు. సెమీ కండక్టర్ ఎకో సిస్టం ను ఇది పెంపొందిస్తుంది.. అయితే దీనిని కేవలం 3.5 సంవత్సరాల వ్యవధిలోనే భారత్ రూపొందించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఇక మన దేశంలో ఐదు సెమీ కండక్టర్ల నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతోంది. దీనివల్ల టెక్నాలజీ మీద భారత్ మరింత గ్రిప్ సాధించనుంది. అగ్రరాజ్యం షరతులు విధించినప్పటికీ.. భారత్ ఏ మాత్రం భయపడలేదు. అంతే కాదు తన ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే మార్గాలను సుగమం చేసుకుంది. అందువల్లే మోడీలో ఈ స్థాయిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అది భారతదేశాన్ని మరింత ఆర్థికంగా శక్తివంతంగా మార్చేందుకు సహకరిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper