కేంద్రంలోని బీజేపీకి భయపడి ఏపీలోని జగన్ సర్కార్ తోపాటు ప్రతిపక్ష టీడీపీ, ఆఖరకు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం సైలెంట్ అయినా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని అక్కడి కార్మికులు రగిలిస్తున్నారు. ప్రజల్లోనూ ఇది సైలెంట్ గా పాకింది. అందుకే బీజేపీకి ఏపీలో నూకలు చెల్లుతుందని అంటున్నారు.
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు మద్దతుగా తెలుగు సినిమా రంగానికి చెందిన వారంతా ముక్తకంఠంతో ఏకమవుతున్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని ఇప్పుడు టాలీవుడ్ నుంచి వాయిస్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఆర్ నారాయణమూర్తి నుంచి అగ్ర హీరో చిరంజీవి వరకు విశాఖ ఉక్కుకు మద్దతుగా గళమెత్తారు. ఇదే వరుసలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పీ పట్నాయక్ కు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా గళమెత్తారు. ఇక ఆయనే కాదు.. మాటల రచయిత కోనవెంకట్ అయితే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
ఇక ఇప్పటికే హీరో మంచు విష్ణు నుంచి మొదలుపెడితే టాలీవుడ్ పెద్లల వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం టాలీవుడ్ నుంచి కూడా స్పందన వ్యక్తమవుతోందని తెలుస్తోంది.