Israel Hamas Conflict: ఇజ్రాయిల్ సేనల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాకు ఇది శుభవార్త.. శిధిలాల మధ్యలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వారికి ఇది గుడ్ న్యూస్. తినేందుకు తినలేక, తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది ముమ్మాటికీ పునర్జన్మే! అనేక దాడులు, కాల్పుల తర్వాత గాజా, ఈజిప్ట్ మధ్య ఉన్న రఫా సరిహద్దు ఎట్టకేలకు తెరుచుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడన్ సహా దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల విజ్ఞప్తితో ఈ సరిహద్దును తెరిచేందుకు ఇజ్రాయిల్ అంగీకరించింది. ఫలితంగా దాదాపు సహాయం అందడం ప్రారంభమైంది. 20 లారీల్లో సహాయక సామాగ్రి గాజాలోకి ప్రవేశించింది. వాటిని చిన్నచిన్న ట్రక్కుల్లో అవసరమైన ప్రాంతాలకు పంపుతున్నారు. ఇంకా దాదాపు 200 లారీల సహాయక సామాగ్రి సరిహద్దు ప్రాంతాల వద్ద వేచి చూస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో కొద్ది రోజుల్లో వాటిని గాజాలోకి పంపుతారు.
ఇజ్రాయిల్ దాడి మొదలుపెట్టిన తర్వాత గాజాలోకి సహాయక సామాగ్రి ప్రవేశించడం ఇదే మొదటిసారి. అంతకు ముందు రోజుకు నాలుగు వందల లారీలు గాజాలోకి వచ్చేవి. ఘర్షణ ప్రారంభమైన తర్వాత సరిహద్దును తెరిచేందుకు ఈజిప్ట్ అంగీకరించినప్పటికీ.. బందీలను విడుదల చేసే వరకు తెరవబోమని ఇజ్రాయిల్ ప్రకటించడంతో ఇప్పటిదాకా అది మూసే ఉంది. ఓవైపు సహాయక సామాగ్రి వస్తూ ఉన్నప్పటికీ.. ఇజ్రాయిల్, హమాస్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ పతా సదస్సు కూడా నిర్వహించారు. యుద్ధాన్ని ముగించేందుకు గల అవకాశాలపై చర్చించారు. గాజాకు సహాయం అందించేందుకు సహకరించాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని, పది సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఇజ్రాయిల్,
పాలస్తీనా శాంతి చర్చలను ప్రారంభించాలని ఆయన సూచించారు. తమ భూభాగంలోని గాజా వాసులను అనుమతించే ప్రశ్నే లేదని తెలిపారు. మరోవైపు జోర్డాన్ రాజు జిల్లా ఈ విషయం మీద మాట్లాడారు. గాజా దిగ్బంధం, ఇజ్రాయిల్ వైమానిక దాడులు యుద్ధ నేరాల కిందకు వస్తాయని ప్రకటించారు.
గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల కారణంగా 345 మంది గత 24 గంటల్లో మరణించారని హమాస్ ప్రకటించింది. హమాస్ వద్ద కిమ్ ఆయుధాలు ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ.. ఇజ్రాయిల్ వైమానిక దాడులను అంత తీవ్రంగా ప్రతిఘటించడం లేదు. అయితే ఇది వ్యూహాత్మక మౌనమా? మరోసారి ఇజ్రాయిల్ పై మెరుపు దాడి చేసేందుకు హమాస్ ప్రయత్నిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయిల్ దాడులు చేసిన నేపథ్యంలో గాజా లో పరిస్థితులు అత్యంత అధ్వానంగా మారాయి.. పీల్చే గాలి తప్ప అక్కడ ఏమీ లేవు. ఫలితంగా అక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The importance of the rafah border crossing and why its reopening is important to egypt and gaza
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com