Homeజాతీయ వార్తలుCentral government : ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇంతకీ ఏంటంటే?

Central government : ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇంతకీ ఏంటంటే?

Central government : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక పండుగ చేసుకోవచ్చు. ఎందుకంటారా? వీరు సంతోషపడేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మోదీ సర్కార్. ఇందులో భాగంగానే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50 శాతం నుంచి 3 శాతం పెరిగింది. ఇది కాస్త 50 నుంచి 53 శాతానికి చేరి వారిని సంతోషపెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఆ తీపి కబురు ఏంటి అంటారా?

కోటి మంది కంటే ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్న విషయం తెలిసిందే. ఇకపై ఇది 53 శాతానికి మార్చాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ఎంటీఎన్ఎల్‌ (MTNL)లో పని చేస్తున్న ఉద్యోగులకు గ్రాట్యుటీ ను పెంచింది కేంద్ర ప్రభుత్వం.

ఈ కంపెనీల ఉద్యోగుల గ్రాట్యుటీని ఏకంగా ఐదు లక్షలు పెంచింది. అంటే రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సవరించిన ఈ కొత్త పరిమితి జనవరి 1, 2024 నుంచే అమలులోకి వస్తుంది. ఈ మార్గదేశాలను ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు నిబంధనల ప్రకారం డీఏ 50 శాతానికి చేరిన క్రమంలో ఇతర అన్ని అలవెన్సులను 25 శాతం మేర పెంచినట్లు తెలిపింది సెంట్రల్ సర్కార్.

అయితే ఇప్పుడు కేంద్ర కేబినేట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు బేసిక్ పేలో డీఏ 53 శాతానికి పెరిగిందనే చెప్పాలి. ఈ పెంపు జూలై 1, 2024 నుంచి లెక్కలోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలు బాగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు.

డీఏ 50 శాతం దాటినట్లయితే చాలా అలవెన్సులు కూడా పెంచాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని 7వ వేతన సంఘం సిఫార్సు చేస్తోంది. దీంతో దాదాపు 13 రకాల అలవెన్సుల్లో 25 శాతం పెరుగుదల కనిపించే అవకాశం ఉందట. జనవరి 1 నుంచే శాలరీలో ఈ మార్పులు వస్తాయని తెలుస్తోంది. ఇక పెరిగిన DA, DRతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. ఇక కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరో కొన్ని రోజుల్లో అంటే 2025 జనవరి నుంచి డియర్‌నెస్ అలవెన్స్‌లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. అయితే ఈ సమాచారం AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా క్లియర్ అవుతుంది. అంటే మొత్తం మీద ఉద్యోగులకు DA పెంపు దాదాపు 3 శాతంగా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత ట్రెండ్‌లు జనవరి 2025 నాటికి డియర్‌నెస్ అలవెన్స్ 56 శాతానికి చేరుకోవచ్చు కూడా.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular