Homeజాతీయ వార్తలుRajiv Gandhi వర్ధంతి : రాజీవ్ గాంధీ హత్యకు అసలు కారణం అదే..

Rajiv Gandhi వర్ధంతి : రాజీవ్ గాంధీ హత్యకు అసలు కారణం అదే..

Rajiv Gandhi : టెక్నాలజీని భారత్ కు తెచ్చిన భారత ప్రధాని రాజీవ్ గాంధీ. దేశాన్ని పాలించింది తక్కువ కాలమే అయినా.. ఎన్నో సంస్కరణలు తెచ్చారు. గొప్ప, గొప్ప నాయకులకు తన మంత్రి వర్గంలో అవకాశం కల్పించి వారికి కీర్తి సంపాదించిపెట్టాడు.

మే 21న భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. 1984 నుంచి 1989 వరకు ప్రధానిగా కొనసాగిన ఆయన రెండో దఫా ఎన్నికల ప్రచారంలో ఉండగా 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ కార్యకర్తల చేతిలో హత్యకు గురయ్యారు. 1991 మేలో ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబర్ చేసిన ఈ హత్య కలకలం రేపింది.

రాజీవ్ గాంధీతో పాటు ఎస్పీ టీకేఎస్ మహ్మద్ ఇక్బాల్ సహా మరో 15 మంది దుర్మరణం పాలయ్యారు. హత్యానంతరం తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థన మేరకు దర్యాప్తును సీబీఐ ప్రత్యేక బృందానికి (సిట్) అప్పగించారు.

నెల తర్వాత దర్యాప్తు అధికారులు ఏజీ పెరారివాలన్ ను అధికారులు అరెస్ట్ చేశారు. 1998లో టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (టాడా) కోర్టు 26 మంది నిందితులకు మరణశిక్ష విధించింది. మురుగన్, శాంతన్, పెరారివాలన్, నళినికి విధించిన మరణశిక్షను 1999లో సుప్రీంకోర్టు సమర్థించింది. దాదాపు దశాబ్దం పాటు ఎన్నో అప్పీళ్ల తర్వాత శాంతన్, మురుగన్, పెరారివాలన్ కు ఉరిశిక్షను 2011 సెప్టెంబర్ లో ఖరారు చేశారు. అయితే 2014లో సుప్రీంకోర్టు ముగ్గురి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.

మూడు దశాబ్దాలకు పైగా జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను వెంటనే విడుదల చేయాలని 2022, నవంబర్ లో సుప్రీంకోర్టు ఆదేశించింది. నళిని, రవిచంద్రన్, జయకుమార్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పియస్లను దోషులుగా తేల్చారు. 1980వ దశకంలో శ్రీలంక అంతర్గత కుమ్ములాటల్లో భారత్ లో వినాశనం సృష్టించాలనుకున్న వారి విషాదకర ఎపిసోడ్ కు ఇది ముగింపు పలికింది

టాస్క్
రాజీవ్ గాంధీని చంపే బాధ్యతను ఎల్‌టీటీఈ తన ఇంటెలిజెన్స్ ఆపరేటర్ కు అప్పగించింది. ఆ తర్వాత తమిళనాడులోని ఎల్‌టీటీఈ నెట్ వర్క్ తో కలవకూడదని టైగర్లు నిర్ణయించుకున్నారు. అంతా అనుకున్నట్లుగా జరగాలని ఎల్టీటీఈ చెన్నైలో మాజీ ప్రధాని వీపీ సింగ్ ఎన్నికల ర్యాలీలో రిహార్సల్స్ కూడా నిర్వహించింది. సింగ్ బయలుదేరుతుండగా, ఆత్మాహుతి బాంబర్ ధను అతని వద్దకు వచ్చి ఒక పెద్దవాడికి గౌరవ సూచకంగా పాదాలను తాకింది.

ఈ ర్యాలీలో ధను చేతిలో గంధపు చెక్క దండ.. ఒంటికి సూసైడ్ బాంబుల దుస్తులు ఉన్నాయి. తన కోసం వేచి ఉన్న జనం వైపు రాజీవ్ గాంధీ వచ్చాడు. అదే గుంపులో ఉన్న ధను రాజీవ్ గాంధీకి దగ్గరగా వచ్చింది. ధను అతనికి దండ వేసి, అతని పాదాలను తాకేందుకు వంగింది. కానీ లేవలేదు. ఆమె తన సూసైడ్ దుస్తులకు అమర్చిన టోగిల్ స్విచ్ ఆన్ చేయడంతో ఆమెతో పాటు రాజీవ్ గాంధీ మరో 16 మంది అక్కడికక్కడే తునాతునకలయ్యారు.

1984లో తన తల్లి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు రాజీవ్ గాంధీ. 1984, అక్టోబర్ లో బాధ్యతలు స్వీకరించిన 40 ఏళ్ల వయసులో భారతదేశ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. 1989, డిసెంబర్ 2 వరకు ఆ పదవిలో పనిచేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular