Homeజాతీయ వార్తలుTejaswi Surya: ఛాలెంజ్‌ పూర్తి చేసిన ఐరన్‌ మ్యాన్‌.. అభినందించిన మోదీ.. ఛాలెంజ్‌ ఏంటంటే..

Tejaswi Surya: ఛాలెంజ్‌ పూర్తి చేసిన ఐరన్‌ మ్యాన్‌.. అభినందించిన మోదీ.. ఛాలెంజ్‌ ఏంటంటే..

Tejaswi Surya: బీజేపీ యువ నేత, బెంగళూరు సౌత్‌ ఎంపీ తేజశ్వి సూర్య.. ఐరన్‌ మ్యాన్‌ 70.3 ఛాలెంజ్‌ పూర్తి చేశారు. ప్రతీ విషయాన్ని సవాల్‌గా తీసుకునే నేత తేజశ్వి. తాజాగా ఆయన గోవాలో నిర్వహించిన ట్రయాథ్లాన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో 1.9 కి.మీ స్విమ్మింగ్, 90 కి.మీల సైక్లింగ్, 21.1 కి.మీల రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఇందుకు మొత్తం ఈవెంట్‌లో 113 కిలోమీటర్లు(70.3 మైళ్లు) ప్రయాణించారు. ఈ ఫీట్‌తో 33 ఏళ్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొదటి ఎంపీగా గుర్తింపు పొందారు. ఈ సంరద్భంగా ఆయన ప్రధాని నరేంద్రమోదీ ఫిట్‌ ఇండియా ఉద్యమాన్ని సవాల్‌గా స్వీకరించడానికి దారితీసిన స్ఫూర్తిగా పేర్కొన్నారు. ఈ ఘటనను స్వయంగా ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. ఈమేరకు ప్రధాని ఎక్ల్‌ ఇలా రాశారు. ‘మెచ్చుకోదగిన ఫీట్‌.. ఫిట్‌నెస్‌ సంబంధిత కార్యకలాపాలను కొనసాగించేందుకు ఇది చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుంది అని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

నాలుగు నెలల కఠిణ శిక్షణ..
ఇదిలా ఉంటే.. తేజశ్వి ఈ టాస్క్‌ను పూర్తి చేయడానికి తేజశి సూర్య నాలుగు నెలలు కఠిన శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పెద్ద ఆశయాలను వెంటాడుతున్న యువ దేశంగా, మనం మన శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాన్నారు. మరింత ఆరోగ్యవంతమైన దేశంగా మారాలన్నారు. ఫిట్‌గా మారడానికి చేసే ప్రయత్నం మరింత క్రమశిక్షణతో, నమ్మకంగా చేస్తుందని తెలిపారు. ఇది మీరు చేపట్టే ఏ వెంచర్‌లోనైనా మీ విజయావకాశాలను మెరుగుపరుస్తుంది అని ఎక్స్‌లో పోస్టు చేశారు. భయంకరమైన ఛాలెంజ్‌లో ఫినిషర్‌గా, ఫిట్‌నెస్‌ లక్ష్యాలు నిజంగా సరిహద్దులను పెంచుతాయని తెలిపారు. మిమ్మల్ని మంచి వ్యక్తిగా మారుస్తాయన్నారు. ఈ ప్రయాణంలో ముందుకు సాగాలని మరియు పురోగతిని సాధించాలని ఫెన్స్‌ సిట్టర్‌లు, శాశ్వత ప్లానర్‌లందరినీ కోరారు.

అథ్లెట్లు, ఫిట్‌నెస్‌ ఔత్సాహికుల కోసం..
ఇదిలా ఉంటే.. అథ్లెట్లు మరియు ఫిట్‌నెస్‌ ఔత్సాహికుల కోసం జరిగే ఈ ప్రీమియర్‌ ఈవెంట్‌ 50 కంటే ఎక్కువ దేశాల నుంచి అథ్లెట్లను ఆకర్షించింది. ఈ సంవత్సరం రేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవల నుండి 120 మంది పోటీదారులు ఉన్నారు, అథ్లెట్‌ బేస్‌లో మహిళలు 12–15 శాతం ఉన్నారు. విశేషమేమిటంటే, ఈ సంవత్సరం పాల్గొనేవారిలో 60 శాతానికి పైగా మొదటిసారి పోటీలో పాల్గొన్నవారే. ఇది భారతదేశంలో ట్రయాథ్లాన్‌ సంఘాన్ని విస్తరించడంలో ఈవెంట్‌ యొక్క ముఖ్యమైన పాత్రను నొక్కి చెబుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular