జాతీయ వార్తలు'జగన్నాథుడి'పై కరోనా ఎపెక్ట్..!

‘జగన్నాథుడి’పై కరోనా ఎపెక్ట్..!


దేశంలోనే పూరి జగన్నాథుడి రథయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో ఏళ్లుగా ఒడిశాలోని లక్షలాది భక్తుల సమక్షంలో పూరి రథయాత్ర ఘనంగా జరుగుతోంది. ప్రతీయేటా 10నుంచి 12రోజులపాటు జరిగే పూరి జగన్నాథుడు రథయాత్రకు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈ ఏడాది కూడా జగన్నాథుడి రథయాత్ర ఘనంగా నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. జూన్ 23నుంచి నిర్వహించనున్న ఈ రథయాత్రకు కరోనా కారణంగా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఈమేరకు గురువారం పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రభుత్వం నిర్వహించొద్దని ఆదేశాలను జారీ చేసింది.

కేంద్రం లాక్డౌన్లో పలు సడలింపులను ఇచ్చింది. జూన్ 8నుంచి దేవాలయాలను తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ దేవాలయాల్లోకి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే సామూహిక ఉత్సవాలపై నిషేధాలు కొనసాగుతున్నాయి. ఒడిశా ప్రభుత్వం జగన్నాథుడి రథయాత్రను ఈనెల 23నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతియేటా ఈ ఉత్సవాల్లో 10నుంచి 12లక్షల మంది భక్తులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈసారి కరోనా కారణంగా 10వేల మందితో పూరి జగన్నాథ్ రథయాత్ర నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.

ఈనేపథ్యంలోనే ఓ స్వచ్ఛంధ సంస్థ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది. కరోనా కారణంగా రథయాత్రను నిలిపివేయాలని ఆ సంస్థ పిటిషన్లో కోరింది. దీనిపై సుప్రీం ధర్మాసం గురువారం విచారణ చేపట్టి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ‘జగన్నాథ్’ అంటే ఆపలేనిది అని అర్థంమని.. కానీ ఎన్నడూ ఆగని జగన్నాథుడి రథచక్రాలను కరోనా మహమ్మారి వల్ల ఆపాల్సి వస్తోందని.. కరోనా సమయంలో అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు..’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చారిత్రక జగన్నాథుడి రథ యాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. రథయాత్రతో సంబంధించి ఎటువంటి వేడుకలు నిర్వహించొద్దని.. భక్తులను అనుమతించవద్దని పేర్కొంది.

ఇప్పటికే తెలంగాణలోనూ ప్రతియేటా భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించే బోనాల వేడుకలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. బోనాలను ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. అమ్మవారికి పూజారుల బృందం బోనాల సమర్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కారణంగా బోనాల వేడుకల కళతప్పడంతో భాగ్యనగరం కళతప్పనుంది. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ తదితర పండుగలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తాజాగా జగన్నాథుడి రథయాత్ర సైతం కరోనా కారణంగా నిలిచిపోవడం శోచనీయంగా మారింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Ustad Bhagat Singh New Look: రెట్రో గెటప్ లో పవన్ కళ్యాణ్ చిందులు..’ఉస్తాద్ భగత్ సింగ్’ లో స్వీట్ సర్ప్రైజ్!

Ustad Bhagat Singh New Look: వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి 'గబ్బర్ సింగ్' చిత్రం ద్వారా తిరుగులేని బ్లాక్ బస్టర్ ని అందించి,...

Dharmasthala Incidents: ధర్మస్థల హత్యల వివాదం.. పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదులో నిజముందా?

Dharmasthala Incidents: ధర్మస్థల.. కర్ణాటకలోని ఒక పవిత్రస్థలం. మంజునాథుడు కొలువై ఉన్న క్షేతం. ఏటా లక్షల మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. అయితే టీవల ఈ క్షేత్రం దారుణమైన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది....

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Skyroot Aerospace

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...