Homeఅంతర్జాతీయంభారత్ కు రష్యా వ్యాక్సిన్.. వచ్చే నెలకు రెడీ?

భారత్ కు రష్యా వ్యాక్సిన్.. వచ్చే నెలకు రెడీ?

రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకున్న రష్యా వ్యాక్సిన్ భారత్ కు రాబోతోంది. మూడో దశను భారత్ లో పూర్తి చేసి పంపిణీ చేసేందుకు రష్యా సంస్థ, భారత ప్రముఖ ఔషధ కంపెనీ ‘డాక్టర్ రెడ్డీస్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో భారత ఫార్మా దిగ్గజం ‘డాక్టర్ రెడ్డీస్’తో రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది.  భారత్ లో క్లినికల్ ట్రయల్స్ చేపట్టడంతోపాటు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను భారత్ లో సరఫరా చేసేందుకు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం నుంచి అనుమతల అనంతరం ఈ ప్రక్రియ మొదలు కానుంది.

Also Read: 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనదే హవా…. ఆ రెండు పార్టీలకు షాక్?

దీనిపై రష్యా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు రష్యాతో చర్చలు జరుపుతోంది. 3వ దశ ప్రయోగాలు పూర్తి చేసి వచ్చే నెల రెండు నెలల్లోనే ఆ వ్యాక్సిన్ భారత ప్రజలందరికీ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రపంచంలోనే అందరికంటే ముందు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ రష్యాదే.. రష్యా ‘స్పుత్నిక్-వీ’ పేరు రెండు ట్రయల్స్ మాత్రమే నిర్వహించి వ్యాక్సిన్ ను విడుదల చేసింది. మూడో దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను తాజాగా భారత్ లోనూ జరిపేందుకు రెడీ అయ్యింది.

Also Read: 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనదే హవా…. ఆ రెండు పార్టీలకు షాక్?

రష్యా వ్యాక్సిన్ రెండు దశలకే విడుదల చేసింది. పైగా ప్రయోగాల్లోనూ ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ప్రముఖ జర్నల్స్ ప్రచురించాయి. దీంతో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు భారత్ లో చేసి ఇక్కడ ప్రజలకు అందించాలని డాక్టర్ రెడ్డీ, రష్యా ఒప్పందం చేసుకోవడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

రెండు దశల్లో సురక్షితమైన రష్యా కరోనా వ్యాక్సిన్ ను మూడో దశ ప్రయోగాలను భారత్ లో జరపబోతున్నాం. అనుమతులు రాగానే 10 కోట్ల డోసులను డాక్టర్ రెడ్డీస్ కు అందిస్తాం అని రష్యా పత్రికా ప్రకటనలో తెలిపింది.  ఈ సంవత్సరం చివరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని వివరించింది. భారత్ కు వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.

Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నిక.. ఇండియన్ అమెరికన్లు ఎటువైపు?

రష్యా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు తాము చేపడుతామని.. కేంద్రం అనుమతించాక.. నిబంధనల ప్రకారం చేస్తామని డాక్టర్ రెడ్డీస్ కోచైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. దీంతో డిసెంబర్ లోపే సురక్షితమైన రష్యా వ్యాక్సిన్ ను రెడీ చేసి భారత ప్రజలకు అందించేందుకు అటు కేంద్రం, ఇటు రెడ్డీస్ ల్యాబ్ రెడీ అవుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular