Homeఆంధ్రప్రదేశ్‌రోజా, రజినీకి షాక్.. వైసీపీలో ఈసారి ఛాన్స్ ఎవరికి?

రోజా, రజినీకి షాక్.. వైసీపీలో ఈసారి ఛాన్స్ ఎవరికి?


వైసీపీలో కొత్తగా మంత్రి పదవుల ఆశలు మళ్లీ చిగురించాయి. ఆ పార్టీలో గండరగండరులు లాంటి ఎమ్మెల్యేలు రోజా, అంబటి, ధర్మాన, భూమన లాంటి సీనియర్లను కూడా పక్కనపెట్టి అల్ప కులాల వారికి మంత్రి పదవులు ఇచ్చి సీఎం వైస్ జగన్ తొలి కేబినెట్ లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సామాజిక న్యాయంతో అందరి మెప్పు పొందారు. తనతోపాటు వైసీపీలో పోరాడిన సీనియర్లను సైతం సామాజిక న్యాయం చేయడానికి పక్కనపెట్టారు. వారిని వేరే పదవుల్లో భర్తీ చేశారు. పదవుల పందేరంలో.. సామాజిక న్యాయంలో తనకు తరతమ బేధాలు లేవని.. పైరవీలకు తావు లేదని నిరూపించారు జగన్.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

కానీ ఇప్పుడు అనుకోకుండా రెండు మంత్రి పదవులు ఖాళీ కాబోతున్నాయి. తాజాగా ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు వైసీపీ రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మండలి రద్దుతో వారి పదవులు పోవడం గ్యారెంటీ కావడంతో జగన్ వారిని రాజ్యసభకు పంపిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఖాళీ అయ్యే మోపిదేవి, పిల్లి సుభాష్ మంత్రి పదవుల్లో ఎవరిని సీఎం జగన్ భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ రెండు పదవులతోపాటు వారిద్దరి ఎమ్మెల్సీ పదవులు ప్రస్తుతానికి ఖాళీ అవుతున్నాయి. ఈ రెండు మంత్రి పదవుల చుట్టూ బోలెడంత మంది ఆశలు పెంచుకున్నారు. ప్రధానంగా రేసులో చాలామంది సీనియర్ల పేర్లు వినిపడుతున్నాయి.

చైనాపై సర్జికల్స్ స్ట్రయిక్ తప్పదా?

తాజాగా ఈ ఇద్దరు బీసీ నేతలైన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు వెళుతుండడంతో వారి స్థానాల్లో జగన్ ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ ఊపందుకుంది. వీరిలో ప్రధానంగా ఫైర్ బ్రాండ్, సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, విడుదల రజినీలకు ఈసారి మంత్రి పదవులు ఖాయమనే ప్రచారం మొదలైంది. వారిద్దరూ కూడా బోలేడు ఆశలు పెంచుకున్నారు.

కానీ తాజాగా వైసీపీ అధిష్టానం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రోజా, రజినీలకు నిరాశ తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణ కరోనా-ఆర్థిక మందగమనం దృష్ట్యా రాబోయే రెండేళ్ల వరకు కూడా ఉండదని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం..ఇప్పట్లో మోపిదేవి, పిల్లి సుభాష్ మంత్రి పదవుల భర్తీ ఉండదని.. వారి శాఖలను ఇతర మంత్రులకు కేటాయిస్తారని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయ్యిందట..

డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారా?

కొత్త మంత్రి పదవుల కోసం చాలా మంది సీనియర్లు ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఒకేసారి రెండున్నరేళ్ల వైసీపీ పాలన తరువాతనే మంత్రి వర్గాన్ని పునరవ్వ్యస్థీకరించి మంత్రి పదవులు ఇస్తామని.. ప్రస్తుతం ఖాళీ అయ్యే స్థానాలను అలాగే వదిలేయాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

రోజా, ధర్మాన , రజినీ, అంబటి, భూమన సహా చాలా మంది సీనియర్లను జగన్ తొలి కేబినెట్ లో మంత్రి పదవులు కేటాయించలేదు. ఇప్పుడు రెండింటిలో ఇద్దరినీ తీసుకొని మిగతా వారికి ఇవ్వకపోతే పొరపొచ్చాలు రావడం ఖాయం. అందుకే మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన సమయంలోనే రెండోదఫాలో సీనియర్లకు పదవులు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

-నరేశ్ ఎన్నం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper