కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ లో ఉన్న రాజ్యసభ సభ్యుల పదవి కాలం మే నాటికీ ముగియనుంది. అయితే ఈసారి పార్టీ వాదనను బలంగా వినిపించే నాయకులని చట్ట సభలకు పంపాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రియాంకను పంపాలని నిర్ణయించారు.
ప్రియాంక గాంధీ ఈ మధ్య కాలంలో పార్టీ వాదనను ప్రజల్లో బలంగా వినిపిస్తూ..బీజేపీని ఉతికేస్తున్నారు. రాహుల్ లొక్ సభలోనే ఉన్నాడు గనుక.. ప్రియాంకను పెద్దల సభకి పంపి..ఇద్దరితో బీజేపీపై ధ్వజమెత్తాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందులోనూ పార్టీ అధ్యక్షురాలి కూతురు కనుక పార్టీలో తనంటే గౌరవం ఉంటుంది. వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నటు తెలుస్తుంది.
అయితే కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ మంత్రులు, ఎంపీలు లోక్ సభలో రాహుల్ గాంధీనే ఒక ఆట ఆడుకుంటారు . అలాంటప్పుడు ప్రియాంకని పంపి ఏదో చేయాలి అనుకుంటే..అది జరిగేపనే కాదు. ఏ పదవి లేదు కనుక ఈసారి పదవి ఇచ్చి పార్టీలో తనకంటూ ఏదో ఒక గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ ఉద్దెశం అయ్యుంటుందని ఎక్కువ శాతం ప్రజలు భావిస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Priyanka gandhi to enter rajya sabha
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com