spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పొత్తుల ముందు ఆ ప్రయత్నంలో పవన్ సక్సెస్

Pawan Kalyan: పొత్తుల ముందు ఆ ప్రయత్నంలో పవన్ సక్సెస్

Pawan Kalyan: పొత్తులో భాగంగా పవన్ కీలక బాధ్యతను తీసుకున్నారు.టిడిపి, జనసేన నాయకులతో నేరుగా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నాం? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాం? అన్న విషయాలను స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కుదుర్చుకున్న ఈ పొత్తులో మీరు భాగస్తులు కావాలని.. త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. నేరుగా పవన్ కోరేసరికి అటు టిడిపి నేతలు, జనసేన నేతలు సైతం మెత్తబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. వరుసగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనసేనతో పాటు టిడిపి నాయకులు సైతం ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లోనే పవన్ కీలక సూచనలతో ప్రసంగాలు చేస్తున్నారు. అవి కొంతవరకు వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

భీమవరంలో పవన్ ఆలోచనతో కూడిన ప్రసంగాలు రెండు పార్టీల శ్రేణులను ఆకట్టుకున్నాయి. సంచలనం గా మారాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉన్న తమను కనీసం సంప్రదించకుండా టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని కేంద్ర పెద్దలు పవన్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఒకానొక దశలో చీవాట్లు తిన్నట్లు కూడా పవన్ గుర్తు చేశారు. ఎన్ని తిట్టినా భరించి చేతులు జోడించి దండాలు పెట్టి.. రాష్ట్ర నాశనం అయిపోతుంది అని చెప్పి.. జాతీయ నాయకులకు ఒప్పించానని.. అందుకే తన కష్టాన్ని గుర్తించి రెండు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు.

151 మంది ఎమ్మెల్యేలు, వేలాదిమంది ప్రైవేట్ సైన్యంగా ఉన్న వాలంటీర్లు, అధికార పార్టీ కనుసన్నల్లో నడిచే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు, దాడుల సంస్కృతిని నమ్ముకున్న వైసీపీ నేతలను ఎదుర్కోవాలంటే బీజేపీ సహకారం అవసరమన్నారు. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు పవన్ ప్రకటించారు. మూడు పార్టీలు కలిస్తేనే మహావృక్షంగా ఉన్న వైసీపీని పెకిలించవచ్చని పవన్ చెప్పుకొచ్చారు. మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కూడా సక్రమంగా జరగాలని అభిప్రాయపడ్డారు.

ఇదంతా తన కోసమో.. జనసేన గెలుపు కోసం చేయడం లేదని.. ఏపీ భవిష్యత్తు కోసమే ఇన్ని అవమానాలు తట్టుకొని ముందుకు వెళుతున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వైసిపి చేస్తున్న అరాచక పాలన నుంచి ప్రజలను, రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఇదంతా చేస్తున్నట్లు పవన్ చెప్పుకొస్తున్నారు.ఒక స్టార్ హీరోగా ఉంటూ.. ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్న నేను ఈ రాష్ట్ర క్షేమం కోసంపొత్తులకు ప్రయత్నించానని.. మూడు పార్టీల శ్రేణులు ఈ విషయం గమనించాలని పవన్ పిలుపునివ్వడం విశేషం. మొత్తానికైతే పొత్తుల ప్రకటన ముందు పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper