PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి గాను ఆయన తన పంథా మార్చుకున్నారు ఇటీవల కాశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన వ్యవహరించిన తీరుతో ప్రజల్లో తన పట్టు నిలుపుకున్నట్లు తెలుస్తోంది. కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం పనిచేసిన కార్మికులతో కలిసి భోజనం చేసి వారి ఆప్యాయతలు పొందారు.

దీంతో ప్రధాని అయినా ప్రజలతో కలిసి భోజనం చేయడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రధాని చర్యకు అందరు ఫిదా అవుతున్నారు. ఎందరో ప్రధానులు వచ్చినా ప్రజలతో కలిసి భోజనం చేసి వారితో కలిసి తిరిగిన నాయకుడిగా మోడీ ఘనత సాధించారు. దీంతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు.
దేశంలో పెద్ద రాష్ర్టమైన ఉత్తరప్రవేశ్ లో ఎలాగైనా అధికారం చేపట్టాలని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో అక్కడి నాయకుల చర్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజులు వారణాసిలో మకాం వేసి అక్కడి పనులు పర్యవేక్షించి వారి ప్రేమను సాధించేందుకు సిద్ధపడ్డారు. దీంతో పార్టీకి జవసత్వాలు నింపే పని తన భుజాలకెత్తుకున్నట్లు తెలుస్తోంది.
కాశీ విశ్వనాథ్ నడవా నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను మోడీ ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి భోజనం చేయడం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రధాని చేసిన పనులు ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. దీనికిగాను సామాజిక మాధ్యమాల్లో తాను చేసిన పనులు హల్ చల్ సృష్టిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఇది పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు.
Haters can call it ‘tokenism’ or whatever else they like, but how many of them would deny a chair and sit even with their domestic help on the same level? @narendramodi offers dignity to people. pic.twitter.com/M3sb79GdTp
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) December 16, 2021