Homeజాతీయ వార్తలుModi meeting with CMs: నిన్న త్రివిధ దళాధిపతులు.. రేపు సీఎంలతో.. మోడీ ఏదో చేయబోతున్నాడు?

Modi meeting with CMs: నిన్న త్రివిధ దళాధిపతులు.. రేపు సీఎంలతో.. మోడీ ఏదో చేయబోతున్నాడు?

Modi meeting with CMs: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై పడుతోంది. యుద్ధంలో పాల్గొనకపోయినా చమురు, గ్యాస్‌ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎల్‌పీజీ ధరలను కేంద్రం ఇప్పటికే పెంచింది. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూతుతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. భారత్‌కు సమీపంలో హిందూ మహా సముద్రంలో కూడా యుద్ధం జరిగింది. ఇక యుద్ధ ప్రభావంతో లాక్‌డౌన్‌ అంటూ కూడా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం […]

Modi meeting with CMs: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై పడుతోంది. యుద్ధంలో పాల్గొనకపోయినా చమురు, గ్యాస్‌ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎల్‌పీజీ ధరలను కేంద్రం ఇప్పటికే పెంచింది. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూతుతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. భారత్‌కు సమీపంలో హిందూ మహా సముద్రంలో కూడా యుద్ధం జరిగింది. ఇక యుద్ధ ప్రభావంతో లాక్‌డౌన్‌ అంటూ కూడా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం ప్రకటన చేశారు. ఇక నిన్న త్రివిధ దళాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రేపు ముఖ్యమంత్రులతో సమావేవం కాబోతున్నారు. సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

మునుపటి చర్చలు
రెండు రోజుల క్రితం త్రివిధ దళాధిపతులతో కేంద్రం సమావేశం, మునుపటి రోజు ఆల్‌ పార్టీ మీటింగ్‌ పూర్తి చేశారు. ఈ సందర్భాల్లో భారతీయుల భద్రత, ఇంధన సరఫరా, ఆర్థిక ప్రభావాలపై చర్చలు జరిగాయి. సీఎంలతో ఈ సమావేశం రాష్ట్ర స్థాయి సమన్వయాన్ని బలోపేతం చేస్తుంది. గల్ఫ్‌ దేశాల్లో భారతీయుల రక్షణ, ఇంధన ధరల నియంత్రణ, ప్రజా సంక్షోభ నిర్వహణపై దిశానిర్దేశం చేయబోతున్నారు.

Also Read: చమురు సంక్షోభానికి చెక్‌.. ప్లాన్‌ బి రెడీ చేసిన భారత్‌

పశ్చిమాసియా సంక్షోభం ఊహించని సవాళ్లు తీసుకొస్తున్న నేపథ్యంలో మోదీ నిర్ణయాలు కేంద్ర–రాష్ట్రాల మధ్య ఐక్యతను పెంచుతాయి. ఇది ఆర్థిక స్థిరత్వం, ప్రజా భద్రతకు దారి తీస్తుంది. అయితే మోదీ భేటీ ఇంకా ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా అన్న ఉత్కంఠ కూడా నెలకొంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper