Homeజాతీయ వార్తలుModi meeting with CMs: నిన్న త్రివిధ దళాధిపతులు.. రేపు సీఎంలతో.. మోడీ ఏదో చేయబోతున్నాడు?

Modi meeting with CMs: నిన్న త్రివిధ దళాధిపతులు.. రేపు సీఎంలతో.. మోడీ ఏదో చేయబోతున్నాడు?

Modi meeting with CMs: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై పడుతోంది. యుద్ధంలో పాల్గొనకపోయినా చమురు, గ్యాస్‌ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎల్‌పీజీ ధరలను కేంద్రం ఇప్పటికే పెంచింది. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూతుతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. భారత్‌కు సమీపంలో హిందూ మహా సముద్రంలో కూడా యుద్ధం జరిగింది. ఇక యుద్ధ ప్రభావంతో లాక్‌డౌన్‌ అంటూ కూడా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం ప్రకటన చేశారు. ఇక నిన్న త్రివిధ దళాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రేపు ముఖ్యమంత్రులతో సమావేవం కాబోతున్నారు. సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

మునుపటి చర్చలు
రెండు రోజుల క్రితం త్రివిధ దళాధిపతులతో కేంద్రం సమావేశం, మునుపటి రోజు ఆల్‌ పార్టీ మీటింగ్‌ పూర్తి చేశారు. ఈ సందర్భాల్లో భారతీయుల భద్రత, ఇంధన సరఫరా, ఆర్థిక ప్రభావాలపై చర్చలు జరిగాయి. సీఎంలతో ఈ సమావేశం రాష్ట్ర స్థాయి సమన్వయాన్ని బలోపేతం చేస్తుంది. గల్ఫ్‌ దేశాల్లో భారతీయుల రక్షణ, ఇంధన ధరల నియంత్రణ, ప్రజా సంక్షోభ నిర్వహణపై దిశానిర్దేశం చేయబోతున్నారు.

Also Read: చమురు సంక్షోభానికి చెక్‌.. ప్లాన్‌ బి రెడీ చేసిన భారత్‌

పశ్చిమాసియా సంక్షోభం ఊహించని సవాళ్లు తీసుకొస్తున్న నేపథ్యంలో మోదీ నిర్ణయాలు కేంద్ర–రాష్ట్రాల మధ్య ఐక్యతను పెంచుతాయి. ఇది ఆర్థిక స్థిరత్వం, ప్రజా భద్రతకు దారి తీస్తుంది. అయితే మోదీ భేటీ ఇంకా ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా అన్న ఉత్కంఠ కూడా నెలకొంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్...
YSR Congress

YSR Congress: పార్టీకి డ్యామేజ్.. వైసీపీ సీనియర్ల ఆవేదన అదే!

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన అదే. ప్రజా పోరాటాలు చేయడం లేదు. ప్రజా ఆందోళనలు నిర్వహించడం లేదు.. జాతీయస్థాయిలో జరుగుతున్న...
OnePlus N6x

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
EPFO News

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
Oktelugu Epaper