Homeజాతీయ వార్తలుJammu Kashmir Separatists: కశ్మీర్‌ వేర్పాటువాదులపై ఉక్కుపాదం..

Jammu Kashmir Separatists: కశ్మీర్‌ వేర్పాటువాదులపై ఉక్కుపాదం..

Jammu Kashmir Separatists: జమ్మూ కశ్మీర్‌లో కొందరు శక్తులు మళ్లీ 2006–08 కాలపు వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కూడా వేర్పాటువాద రాజకీయాలను పునరుజ్జీవింపజేయాలని, పాకిస్తాన్‌తో సత్సంబంధాలు కొనసాగాలని కొందరు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ ఇంటెలిజెన్స్‌ వేర్పాటువాదుల ఆర్థిక వనరులపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ముగ్గురు వ్యక్తుల ఆస్తులను జప్తు చేసింది. ఇది వేర్పాటువాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే వ్యూహం. ఆర్థిక వనరులపై దాడి… జమ్మూ కశ్మీర్‌ […]

Jammu Kashmir Separatists: జమ్మూ కశ్మీర్‌లో కొందరు శక్తులు మళ్లీ 2006–08 కాలపు వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కూడా వేర్పాటువాద రాజకీయాలను పునరుజ్జీవింపజేయాలని, పాకిస్తాన్‌తో సత్సంబంధాలు కొనసాగాలని కొందరు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ ఇంటెలిజెన్స్‌ వేర్పాటువాదుల ఆర్థిక వనరులపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ముగ్గురు వ్యక్తుల ఆస్తులను జప్తు చేసింది. ఇది వేర్పాటువాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే వ్యూహం.

ఆర్థిక వనరులపై దాడి…
జమ్మూ కశ్మీర్‌ ఇంటెలిజెన్స్‌ ఒక మాజీ వ్యాపారి డాక్టర్‌ ముబీన్‌ అహ్మద్‌ షా, ఒక ఆర్కిటెక్ట్‌ అజీజ్‌ ఉల్‌ హసన్‌ అషాయ్‌ అలియాస్‌ టోనీ అషాయ్‌. ఒక జర్నలిస్టు–మానవహక్కుల కార్యకర్త రిపర్ట్‌ వాణి ఆస్తులను సీజ్‌ చేసింది. వీరు ఉన్నత స్థాయిలో ఉండి వేర్పాటువాద ఆలోచనలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో ఒకరు కశ్మీర్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు. ఆయన కాలంలో క్రాస్‌ బార్డర్‌ వ్యాపారం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించి, ఆ నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు చెందిన భూములు జప్తు అయ్యాయి. రెండో వ్యక్తి అంతర్జాతీయంగా పనిచేస్తున్న ఆర్కిటెక్ట్‌. ఆయన కశ్మీర్‌ విషయంలో విదేశాల్లో విషప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడో వ్యక్తి జర్నలిస్టు–మానవహక్కుల కార్యకర్త. వీరి ఆస్తులపై కూడా చర్యలు జరిగాయి. ఈ ముగ్గురూ 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అయిన వెంటనే దేశం వదిలి విదేశాలకు వెళ్లిపోయారు. వారికి 2025 డిసెంబర్‌లో నోటీసులు జారీ చేసి, 2026 జనవరి 26లోపు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

అంతర్జాతీయ ఆశ్రయాలు…
వేర్పాటువాద నాయకుల్లో చాలా మందికి మలేషియా, పాకిస్తాన్, ఇంగ్లండ్‌ వంటి దేశాలు ఆశ్రయం ఇస్తున్నాయి. వారి ఆస్తులు మాత్రం భారతదేశంలోనే ఉండటం వల్ల ఇప్పుడు ఆ ఆస్తులు జప్తు అవుతున్నాయి. ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని బయటపెడుతోంది. వేర్పాటువాద నాయకులు భారతదేశంలో అల్లర్లు, హింసను ప్రోత్సహించి, సాధారణ ప్రజల జీవితాలను దెబ్బతీస్తారు. కానీ వారి సొంత పిల్లలు విదేశాల్లో సుఖంగా చదువుకుంటారు. 2019కి ముందు జమ్మూ కశ్మీర్‌లో స్కూళ్లు నెలల తరబడి మూతపడేవి. పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యేవారు. అదే నాయకులు తమ పిల్లలను మలేషియా, ఆస్ట్రేలియా, లండన్‌లో చదివించేవారు. ఈ డబుల్‌ స్టాండర్డ్‌ ఇప్పుడు బయటపడుతోంది.విశ్లేషణ: ఆర్థిక దెబ్బతో వేర్పాటువాదం బలహీనంఈ ఆస్తి జప్తులు కేవలం శిక్షాత్మక చర్యలు కావు. అవి వేర్పాటువాదం యొక్క ఆర్థిక మద్దతును తగ్గించడానికి ఉద్దేశించినవి. అక్రమ వ్యాపారం, ఉగ్రవాద నిధులు, అంతర్జాతీయ విషప్రచారం వంటి వనరులను నిలిపివేయడం ద్వారా వేర్పాటువాద ఉద్యమం యొక్క బలాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

2019కి ముందు ఉన్న పరిస్థితులు…
2019లో కేంద్రం ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. అంతకుముంద నిరంతర అల్లర్లు, స్కూలు మూతలు, ఆర్థిక అస్థిరత సాధారణ ప్రజలకు ఎంత నష్టం కలిగించాయో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఆ కాలంలో నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపి, సాధారణ ప్రజలను బలి తీసుకునేవారు. ఇప్పుడు ఆ ఆస్తులు జప్తు అవుతున్నాయి.ఖలిస్తానీ నాయకుల విషయంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే వారు దేశంలోకి రాకుండా ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది చట్టబద్ధమైన ప్రక్రియలో భాగమని, ఆరోపణలు నిరూపితం కావాలని న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది.

కేంద్రం చేపట్టిన ఈ చర్యలు జమ్మూ కశ్మీర్‌లో భద్రతా వాతావరణం మారిందని, వేర్పాటువాదం ఇకపై సులభంగా వ్యాపించలేదని సూచిస్తున్నాయి. ఆర్థికంగా బలహీనపడిన వేర్పాటువాదం రాజకీయంగా కూడా బలహీనపడే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper