
తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.”సీఎం పీఠం పొయ్యాకా.. కేసీఆర్ బ్రతుకు కుక్కకంటే దారుణమౌతుందని జగ్గారెడ్డి అన్నారు. రైతు దీక్షను చూసి తట్టుకోలేక కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారని ఆయన చిల్లర రాజకీయాలు చేస్తున్నారని,
కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుందని జగ్గారెడ్డి అన్నారు. పదవిపోయిన తెల్లారి నీ కుటుంబ సభ్యులెవరు నీ వెంట వుండరని, నిన్ను కుక్కలు కూడా పట్టించుకోవు. కాబట్టి ఇప్పుడే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అహంకారాన్ని తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు.
“కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఇవ్వడం వల్లనే నీవు సీఎం అయ్యావు. సోనియా ను ఒప్పించి తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ నాయకులు బఫ్యూన్ గాళ్ళు అయ్యారా? తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి కేసీఆర్” అంటూ జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు.
రైతు సమస్యలు మాట్లాడితే చిల్లగాళ్లంటావా? చిల్లరగాళ్లని రైతులను అవమానిస్తారా? ప్రగతి భవన్ లో మీరు ఉన్నట్టు రైతులందరూ సుఖంగా లేరుని జగ్గారెడ్డి అన్నారు. తాగండి, సావండి, ఖజానా నింపండి, అన్నట్లుగా ఉంది కేసీఆర్ వైఖరి అని ఆయన విమర్శించారు.
దేశంలో అతి తక్కువ కరోనా పరీక్షలు తెలంగాణాలో జరిగాయి. మరణాలు దాచిపెట్టడం కూడా తెలంగాణాలోనే జరిగింది. అంతా బాగుంటే లాక్ డౌన్ పొడిగించుడు ఎందుకో. అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.