spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan : మంత్రులకు ఝలక్ ఇచ్చిన జగన్.. ఇద్దరు.. ముగ్గురు ఔట్..?

CM Jagan : మంత్రులకు ఝలక్ ఇచ్చిన జగన్.. ఇద్దరు.. ముగ్గురు ఔట్..?

CM Jagan : రాష్ట్ర మంత్రివర్గంలో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయా..? ఎన్నికలకు ఏడాది ముందు తన కొత్త టీం ను సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకోబోతున్నారా..? మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది.

‘ఈసారి మరో రెండు మూడు టికెట్లు ఎగిరిపోతాయి పనితీరు మదింపు చేసి దాని ఆధారంగా టికెట్లు ఇస్తాం’ అని మంత్రులు సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. ‘మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి అసెంబ్లీలో మంత్రులు అందరూ దూకుడుగా వ్యవహరించాలి చర్చల్లో చిరుగా స్పందించాలి ప్రతి ఒక్కరు పని తీరుపై ఆడిట్ ఉంటుంది’ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమెకు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్లు చెబుతున్నారు. ఎటువంటి సందర్భం లేకుండానే ముఖ్యమంత్రి అనూహ్యంగా ఈ అంశాన్ని ప్రస్తావించడంతో మంత్రులు అవాక్కైనట్లు చెబుతున్నారు.

-ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం..

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల కింద జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. నిన్నటి వరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాగానే పనిచేసినట్లు నివేదికలు అందాయన్నారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత కూడా మంత్రులదేనని, పోలింగ్ సమయంలో పార్టీ అభ్యర్థులకు సక్రమంగా ఓట్లు వేసేలా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. 21, 22 తేదీల్లో అసెంబ్లీకి ఉగాది సందర్భంగా సెలవు ఇవ్వడంతో 23న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరయ్యాలా చూడాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. ఎవరైనా రాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని, అందువల్ల అందరూ వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులుదేనని గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఈనెల 25 నుంచి వారం రోజులపాటు ఆసరా వారోత్సవాలను ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆదేశించారు.

విశాఖకు జూలైలో..

ఇక విశాఖపట్నం రాజధానిగా పాలన సాగించాలని భావిస్తున్న వైసిపి ప్రభుత్వం.. ఆ దిశగాను అడుగులు ముందుకు వేస్తుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపైన కూడా సీఎం మాట్లాడినట్లు చెబుతున్నారు. విశాఖపట్నానికి జూలైలో వెళ్తున్నామని, అప్పటికల్లా అన్ని కుదురుకుంటాయని మంత్రులతో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు విజయవంతమైన సీఎం అభినందిస్తూ మంత్రివర్గ సభ్యులు తీర్మానం చేసిన సందర్భంగా స్పందిస్తూ సీఎం పై వ్యాఖ్యలు చేశారు. సమావేశం చివరిలో మంత్రి దాడిశెట్టి రాజా కల్పించుకుంటూ ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు విషయాన్ని ప్రస్తావించగా విశాఖలో ఇద్దాం అని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లకు, న్యాయమూర్తులకు విశాఖలో ఇళ్ల స్థలాలు ఇస్తామని, పెట్టుబడిదారులు ఎవరైనా వచ్చే అక్కడ ఉంటామంటే వారికి స్థలాలు ఇస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి 15 లక్షల కార్డులు పంపిణీ ఆగిపోయిందని, రూ. 30 కోట్లు మంజూరు చేస్తే వాటిని పంపిణీ చేయగలమని రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ సిఎం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది. రూ. 30 కోట్ల అయితే పెద్ద విషయమేమీ కాదు కదా చేయండి అని సీఎం అనగానే, సాంకేతిక కారణాలను సీఎస్ జవహర్ రెడ్డి ఏదో చెప్పబోగా,  ‘చేసేయండి విశ్వరూపం సమన్వయం చేస్తారని సీఎం చెప్పినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper