Homeజాతీయ వార్తలుOil : దారుణంగా పెరుగుతున్న నూనె వాడకం..మరీ ఇంత ప్రమాదమా?

Oil : దారుణంగా పెరుగుతున్న నూనె వాడకం..మరీ ఇంత ప్రమాదమా?

Oil : ప్రస్తుతం చాలా మంది బిజీగా ఉంటూ వారి ఆహారం మీద శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఇందులో యువకులు కూడా ఉన్నారు. అనారోగ్యకరమైన ఆహారం, మంచి లైఫ్ స్టైల్ మెయింటెన్ చేయకపోవడం వల్ల భారతదేశంలో ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. ఇటీవల, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ప్రజలకు కనీస నూనె వినియోగం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మన దేశంలో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ఈ ఊబకాయం కారణం అవుతుందట. దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా?

నేడు, చాలా ఇళ్ళలో ఎక్కువ నూనె, మసాలాలు ఉపయోగించడం ట్రెండ్‌గా మారింది. పొరుగువారి ఇంట్లో ప్రతి నెలా 5 నుంచి 6 లీటర్ల నూనె వినియోగిస్తున్నారు అని మనం కూడా స్పెషల్స్ చేయడం పెరిగిపోయింది. అంతేనా? ఇక కూరగాయలకు ఎక్కువ మసాలాలు కూడా కలుపుతారు. నూనెలు, మసాలాలు ఎక్కువగా తింటే అత్యున్నత స్థాయికి కొలమానం అనుకుంటారు కానీ, ఈ నూనెలు, మసాలాల వల్ల నేడు అనేక రోగాల బారిన పడుతున్నారని వారికి తెలియదు. ఇందులో గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం, కొవ్వు కాలేయం వంటి వ్యాధులు ఉన్నాయి.

వైద్యులు ఏం అంటున్నారు?
ఆహారంలో నూనె ఎక్కువగా వాడటం వల్ల అనేక రోగాలు వస్తాయని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో డాక్టర్ అజిత్ కుమార్ చెబుతున్నారు. నూనెను ఎక్కువగా ఉపయోగిస్తే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది అంటున్నారు. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది. నూనెను ఎక్కువగా వాడటం వల్ల కూడా కేలరీలు పెరుగుతాయి. ఇది ఊబకాయానికి కారణమవుతుంది. ఎక్కువ నూనె తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ప్రజలు తమ ఆహారంలో నూనె వాడకాన్ని తగ్గించాలి.

నూనె ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు
అధిక మొత్తంలో నూనె తీసుకోవడం మొత్తం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ నూనె తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా హార్ట్ బ్లాక్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాదు క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడాలి.

నూనె వినియోగం ఏటా పెరుగుతోంది
భారతదేశంలో నూనె వినియోగం ఏటా పెరుగుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, ఒక వ్యక్తి సంవత్సరానికి 10.585 కిలోల నూనెను తినాలి. ఈ వినియోగం ప్రతి సంవత్సరం పెరుగుతోంది. 2010-11లో భారతదేశంలో తలసరి నూనె వినియోగం సంవత్సరానికి 14.2 కిలోలు. ఇది 2019-20లో ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 19.80 కిలోలకు పెరిగింది. అంటే ఐదు దశాబ్దాల్లో భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్ వినియోగం 5 రెట్లు పెరిగింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువగా నూనె వాడటం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది అని తేలింది. ఊబకాయం, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. సో కాస్త తగ్గించుకోవడం చాలా మంచిది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular