Homeఆంధ్రప్రదేశ్‌Campaigning: మోదీ ఖాతాల్లో జమ చేస్తే.. జగన్ ప్రచారం చేసుకుంటున్నారా?

Campaigning: మోదీ ఖాతాల్లో జమ చేస్తే.. జగన్ ప్రచారం చేసుకుంటున్నారా?

Campaigning: బీజేపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా పీఎం-కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద ఒక్కో రైతుకు 2వేల నగదును వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లో కిసాన్ పథకం కింద మూడో విడుత నగదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

2022 సంవత్సరం తొలిరోజే 10వేల కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2వేల చొప్పున 20వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి రైతులతో మాట్లాడారు. ఈ కిసాన్ పథకం కింద ఏపీ రైతులకు సైతం డబ్బులు అందాయి. అయితే ఈ పథకం కింద ఏపీ సర్కారు ఎలాంటి నగదును ఇవ్వకపోయినా ప్రచారం మాత్రం చేసుకుంటోంది.

ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు విడుదల చేసిన డబ్బులనే తిరిగి ఏపీ సర్కారు వారి ఖాతాల్లో జమ చేయనుంది. సోమవారం ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఓ బటన్ నొక్కడం ద్వారా రైతుల ఖాతాల్లోకి 48.86 లక్షల మందికి రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమ కానున్నాయి. అలాగే 1.51 లక్షల మంది కౌలుదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు రూ.2వేల చొప్పున రూ.30.20 కోట్లు అందనున్నాయి.

ఈ పథకం ప్రారంభ సమయంలో ఎప్పుడు ఫుల్ పేజీ యాడ్ తో పబ్లిసీటీ చేసే సర్కారు ఈసారి హాఫ్ పేజీ యాడ్ తో సరిపెట్టింది. ముందుగానే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ప్రభుత్వం గతంలో మాదిరిగానే ప్రచార ఆర్భాటం చేయడం లేదు. కాగా రైతు భరోసా కింద ఏపీ సర్కారు రైతులకు రూ.13,500 ఇస్తామని చెబుతోంది. అయితే ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న 6వేలను రాష్ట్ర ప్రభుత్వం కలిపేసింది.

కేంద్రం మూడు విడుతల్లో డబ్బులను రైతులకు విడుదల చేస్తుండటంతో రాష్ట్రం సైతం మూడు విడుతల్లో ఇస్తోంది. మొదటి విడతలో కేంద్రం ఇచ్చే 2వేలతోపాటు ఐదున్నర వేలు, రెండో విడతలో కేంద్రం ఇచ్చే 2వేలతోపాటు మరో రెండు వేలు, మూడో విడతలో కేంద్రం ఇచ్చే 2వేలను ఏపీ సర్కారు అందిస్తోంది.

ఏపీ సర్కారు రైతులకు ఇప్పుడు మూడో విడుత డబ్బులను ఇవ్వనుంది. దీంతో ఈసారి ఏపీ సర్కారు కేంద్రం విడుదల చేసిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించే అవసరం లేకుండా పోయింది. అయితే కేంద్రం కౌలు రైతులకు ఎలాంటి సాయం అందించడం లేదని తెలుస్తోంది.

జగన్ సర్కారు మాత్రం కౌలు రైతులను గుర్తించి సాయం చేస్తోంది. మొత్తంగా ఏపీలో ఒకటిన్నర లక్షల మంది రైతులున్నాయి. దీంతో వీరికి 2వేల చొప్పున ఏపీ సర్కారు 30కోట్లను ఈరోజు జమ చేయనుంది. అంటే ప్రభుత్వం ఖర్చు 30కోట్లు ఖర్చు చేస్తూ విరివిరిగా పబ్లిసిటీ చేసుకుంటుందనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Oktelugu Epaper