
వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన బావిలో శావాల కేసు మిస్టరీ వీడింది. సంజయ్ అనే బీహార్ వ్యక్తితో ఒక స్త్రీ పెట్టుకున్న అక్రమ సంబంధం ఆ స్త్రీతో పాటు మరో 9మందిని బలి తీసుకుంది. వరంగల్ గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాం లో పరిచయం, ఇంటివరకు వచ్చిన సంబంధం, 10 మందిని బలి తీసుకున్న అక్రమ సంబంధం. ఇది టోటల్ గా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటన.
ఈ ఉదంతంలో పాత్రలు
సంజయ్ కుమార్ యాదవ్ (24) నిందితుడు, మక్సూద్ (గోదాం లో సంజయ్ తో పాటు పని చేసేవాడు)
రఫీకా (31) (సంజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి)
బుస్రా, (రఫీకా కూతురు సంజయ్ తో ప్రేమ)
నలుగురు వ్యక్తులు మక్సూద్ కుటుంబ సభ్యులు కాగా మరో ముగ్గురు బయట వ్యక్తులు.. ఈ పది మందికి సంజయ్ హత్య చేశాడు.
పరిచయం నుండి హత్య వరకు ఇలా..
గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్, అతడి భార్య పనిచేసేవారు. ఈ క్రమంలోనే బిహార్ కు చెందిన సంజీవ్ కుమార్ యాదవ్ కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజీవ్ దగ్గరయ్యాడు. అనంతరం గీసుకొండ మండలం జాన్ పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. అయితే తన కుమార్తెతో కూడా నిందితుడు చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్ ను నిలదీసింది. పలుమార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని, పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజీవ్ యాదవ్ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్ రథ్ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్రమాత్రలు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో రైల్లోంచి తోసేశాడు. అనంతరం తిరిగి గీసుకొండ చేరుకున్నాడు. అయితే, తన అక్క కూతురు గురించి మక్సూద్ భార్య నిషా నిలదీసింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్ కుటుంబాన్ని కూడా హతమార్చాలని టార్గెట్ పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 16వ నుంచి 20వ తేదీ వరకు రోజూ వారు పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించేవాడు. చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించాడు. ఈ నెల 20వ తేదీన మక్సూద్ మొదటి కుమారుడైన షాబాజ్ పుట్టిన రోజు అని తెలుసుకుని ఆ రోజే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 18వ తేదీన వరంగల్ చౌరస్తాలో ఓ మెడికల్ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 20వ తేదీ రాత్రి వారితో ముచ్చటించాడు. అనుకూలంగా ఉన్న సమయంలో మక్సూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న వారందరినీ గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు.
ఈ కేసును ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసి, గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు.