kurchi thatha: టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
అయితే గుంటూరు కారం సినిమా నుంచి తాజాగా మాస్ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ పాట ఓనర్ కుర్చీ తాత కాలా పాషా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ కు ఆయన పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో కాలా పాషా ఓ సందర్భంలో కుర్చీని మడతపెట్టి.. అంటూ చెప్పిన డైలాగ్ ను సాంగ్ లో వాడారు తమన్. దీనిపై కాలా పాషా స్పందిస్తూ పాట అంతా తాను పాడలేదన్నారు. కొన్ని లైన్లు మాత్రమే పాడానన్న ఆయన తన డైలాగ్ ను సినిమాలో వాడుకున్నందుకు రూ. లక్ష పారితోషికం ఇచ్చారని చెప్పుకొచ్చారు. మహేశ్ బాబు నటించిన సినిమాలోని పాటలో తన డైలాగ్ ను పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
కాగా మహేశ్ బాబు – శ్రీలీల జంటగా నటిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తల్లి – కొడుకు సెంటిమెంట్ మరియు విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘దమ్ మసాలా’, ‘ ఓ మై బేబీ’ పాటపై ట్రోలింగ్ జరుగుతుండగా తాజాగా వచ్చిన మాస్ గీతం ‘కుర్చీ మడతపెట్టి’ అనే సాంగ్ ప్రోమోపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More