గుస్సాడీ.. గోండుల జీవితంతో విడదీయలేని నృత్యం. ప్రకృతి రమణీయతకు మురిసి నెమలి పురివిప్పి ఆడినట్టుగా ఆదివాసీ బిడ్డలు లయబద్ధంగా ఆడే ఆట. దశాబ్దాలుగా ఆదివాసీల అరుదైన కళ గుస్సాడీకి ప్రాణం పోస్తున్న కనకరాజుకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకారుడు కనకరాజుకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Also Read: కేటీఆర్ ఎట్టి పరిస్థితిలో సీఎం కాడంట..: రేవంత్ వ్యాఖ్యలు
ఆదివాసీ బిడ్డకు ఈ గౌరవం దక్కడంతో మర్లవాయిలో అర్ధరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం పద్మా పురస్కారాలను ప్రకటించడం.. కళల కోటాలో కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో మర్లవాయి మురిసిపోయింది. కుమురం భీం అసిఫాబాద్ జిల్లాకు చెందిన జైసూర్ మండలం మర్లవాయి గ్రామానికి కనకరాజు తల్లిదండ్రులు రాము, రాజుబాయి. కనకరాజుకు ఇద్దరు భార్యలు, 11 మంది సంతానం. మగపిల్లలు ముగ్గురు కాగా, ఆడ పిల్లలు ఎనిమిది మంది. ఆదివాసీల అరుదైన కళ గుస్సాడీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జీవన సంస్కృతులు ప్రతిభించేలా ఆయన ప్రచారం చేశారు. అంతరిస్తున్న కళను కాపాడుకుంటూ వచ్చారు కనకరాజు.
Also Read: కేటీఆర్ కేబినెట్ లో అంతా యువ బ్యాచ్? వీరికే చాన్స్?
కనకరాజుకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల కనకరాజుకు సన్మానం చేశారు. పద్మశ్రీ అవార్డు రావడంతో మర్లవాయి గ్రామస్తులుగా గర్వపడుతున్నామన్నారు. ఇందిరాగాందీ నుంచి కేసీఆర్ వరకు మహా నేతల సమక్షంలో తమ కళను ఆవిష్కరించారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం పుట్టిన ఊరు మర్లవాయిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నానని వివరించారు కనకరాజు. తెలంగాణ నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక ఆదివాసీ కనకరాజు కావడం మరో విశేషం. మర్లవాయి హైమన్ డార్ఫ్ దంపతులు నడయాడిన నేల. ఇంతటి చరిత్ర కలిగిన మారుమూల మర్లవాయి నుంచి ఇంత గొప్ప సత్కారం పొందడం అటు రాష్ట్రానికి.. ఇటు జిల్లాకు గర్వకారణం.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్