Homeజాతీయ వార్తలుEthanol Cooking Stove: ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయం.. వస్తోంది ఇథనాల్‌ కుకింగ్‌ స్టవ్‌

Ethanol Cooking Stove: ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయం.. వస్తోంది ఇథనాల్‌ కుకింగ్‌ స్టవ్‌

Ethanol Cooking Stove: పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో ఇంధన సంక్షోభం నెలకొంది క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో పెట్రో ధరలు పెరుగుతున్నాయి. ఎల్పీజీ సరఫరా నిలిచిపోవడంతో వాటి ధరలను కేంద్రం పెంచింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్‌ సరఫరా నిలిచిపోయి మూతపడుతున్నాయి. ఈ తరుణంలో ప్రయత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇంధన రంగంలో కొత్త మలుపు రాబోతోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఇటీవల ఇథనాల్‌ ఆధారిత కుకింగ్‌ స్టవ్‌లను ఎల్‌పీజీ సిలిండర్లకు ఆర్థికపరంగా మంచి ప్రత్యామ్నాయంగా సిఫార్సు చేశారు. దేశీయ ఇంధన వనరులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన వచ్చింది. ఇథనాల్‌ స్టవ్‌లను ప్రోత్సహించడానికి యువతను ఆకర్షించేలా రూ.40 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించడం ఈ సూచనకు ఆచరణాత్మక బలం ఇస్తోంది.

ఇథనాల్‌ స్టవ్‌ ఎలా పని చేస్తుంది?
ఈ స్టవ్‌లో నీటిలో కేవలం 7 శాతం ఇథనాల్‌ కలిపితే సరైన మంట వస్తుందని గడ్కరీ తెలిపారు. సాధారణ ఎల్‌పీజీ స్టవ్‌లతో పోలిస్తే ఇందులో మసి, పొగ, కాలుష్యం ఏమీ ఉండదు. ఇథనాల్‌ సులభంగా లభ్యమవుతుంది మరియు దేశంలోని చక్కెర కర్మాగారాలు, మక్క ఉత్పత్తి నుంచి సులభంగా తయారు చేయవచ్చు. ఇప్పటికే ఈ స్టవ్‌లు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి, కాబట్టి సాధారణ ప్రజలు సులభంగా ప్రయత్నించవచ్చు.

ఇథనాల్‌ స్టవ్‌తో ప్రయోజనాలు..
ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇథనాల్‌ స్టవ్‌ గృహిణుల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. పొగ, మసి లేకపోవడం వల్ల ఇంటి లోపలి గాలి నాణ్యత మెరుగుపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దేశీయ ఇథనాల్‌ ఉత్పత్తి పెరిగి రైతులకు కొత్త ఆదాయ వనరు అవుతుంది. రూ.40 కోట్ల పథకం ద్వారా స్టార్టప్‌లు, యువ ఇంజనీర్లు ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి ప్రోత్సాహం లభిస్తుంది.

ఇథనాల్‌ బ్లెండింగ్‌లో భారత్‌ ఇప్పటికే ముందుకు వచ్చింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని పెంచడం ద్వారా క్రూడ్‌ ఆయిల్‌ ఆదా చేస్తోంది. ఇప్పుడు కుకింగ్‌ రంగంలోకి ఈ టెక్నాలజీని తీసుకురావడం సమగ్ర ఇంధన వ్యూహంలో భాగమని చెప్పవచ్చు.అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి:ఇథనాల్‌ సరఫరా గొలుసు బలోపేతం చేయాలి. సాధారణ ప్రజలు మారడానికి అవగాహన కార్యక్రమాలు అవసరం. స్టవ్‌ ధర, భద్రత, వినియోగ సౌలభ్యం వంటి అంశాల్లో మెరుగుదల చేయాలి. ఈ పథకం విజయవంతమైతే గ్రామీణ భారత్‌లో ఇంధన వినియోగం, పర్యావరణ రంగంలో ముఖ్యమైన మార్పు వస్తుంది. ప్రభుత్వం ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తే రైతులు, పరిశ్రమలు, గృహిణులు మూడు వర్గాలు కూడా లాభపడతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular