spot_img
Homeఆంధ్రప్రదేశ్‌భూకంప ప్రచారం.. ప్రజల చివాట్లు..

భూకంప ప్రచారం.. ప్రజల చివాట్లు..

Earthquake
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలోని నిర్మాణాలు పూర్తి చేస్తామని.. రూ.3వేల కోట్లు తీసుకోవడానికి గ్యారంటీ ఇస్తామని ప్రకటించింది. తరువాత వైసీపీ నేతలు తమకు అమరావతిపై ఉన్న ప్రేమను వలకబోశారు. ఎంతో అనుమానం ఉన్నా.. అధికార పార్టీ కదా.. చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉండిపోయింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ నేతలు దీన్నే అస్ర్తంగా వాడుకుంటున్నారని.. అమరావతిని కట్టడం వారి ప్రభుత్వానికి చేతకాదని విపక్ష నాయకులు అంటన్నారు.

Also Read: విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి కేసులో సంచలన ట్విస్ట్

ఎవరివాదనలు ఎలా ఉన్నా.. హఠాత్తుగా శనివారం అమరావతిలో భూకంపం అంటూ.. అధికార పార్టీ వైసీపీ అధినేత మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. వైసీపీ సోషల్ మీడియా సైతం పోస్టులతో దుమ్ము లేపింది. అసలు ఏ మీడియాలోనూ భూకంపం.. భూ ప్రకంపనలు.. అనే అంశాలే కనిపించలేదు. అసలు ఉన్నట్టుండి భూకంపం ఎక్కడి నుంచి వచ్చింది..? అని ఆరా తీస్తే.. రాజధాని గ్రామాలకు అవతలి కర్లపూడి అనే గ్రామంలో మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల ఏర్పడిన కంపం అని తెలిసింది.

Also Read: కృష్ణదేవరాయలు మరణించింది ఎప్పుడో తెలుసా

కొంతమంది వైసీపీ నేతలు అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్ తో పేలుళ్లు జరుపుతున్నారు. అధికారులు కూడా అధికార పార్టీకి చెందిన వారిని పట్టించుకోవడం లేదు. దీంతో వారు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో మైనింగ్ కోసం చేశారో.. లేక అమరావతి భూకంపం అని ప్రచారం చేయడానికి చేశారో.. కానీ.. ఒక్కసారే పెద్ద ఎత్తున పేలుళ్లను జరిపించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి జగన్ మీడియాలో అమరావతిలో భూకంపం అనే ప్రచారం జోరుగా సాగింది. దీన్ని చూసిన అమరావతి చుట్టు పక్కల ప్రజలు ముక్కున వేలేసుకోవడం వారి వంతయ్యింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

తమ ప్రాంతంలో ఇంతపెద్ద కుట్ర జరుగుతుందా..? అని అమరావతి చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్య పోయారు. అయితే ఇలాంటి ఘటన జరిగితే తక్షణమే బాధ్యులను అరెస్టు చేయాలి. కానీ పోలీసులు అలాంటి చర్యలు తీసుకోలేదు. మొత్తానికి అమరావతి కట్టిస్తామని ప్రకటనలు చేసి.. ఏదో విధంగా పాజిటివ్ నెస్ తెచ్చుకుందామనుకున్న అధికార పార్టీ.. అమరావతిపై తప్పుడు ప్రచారం చేసే అవకాశాన్ని వదులుకోబోమని తెల్చేచి. ప్రజల్లో ఏర్పడిన పాజిటివ్ అనుమానాలను ఒక్కరోజులో పటాపంచలు చేసింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper