Homeజాతీయ వార్తలువిదేశాల నుంచి వస్తే ఇల్లు కదలకండి!

విదేశాల నుంచి వస్తే ఇల్లు కదలకండి!

దేశంలో ‘కరోనా’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి ఎవరొచ్చినా 14 రోజులు ఇల్లు కదలవద్దని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర హితవు చెప్పారు. అటు వనీత్ వారిని రెండు వారాలపాటు హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటివరకూ వైరస్ లక్షణాలు ఉన్నవారినే ఐసోలేషన్‌‌లో ఉంచుతుండగా, ఇకపై లక్షణాలతో సంబంధం లేకుండా అందరినీ హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో పెట్టనున్నారు. వైరస్‌‌ సోకిన వ్యక్తికి లక్షణాలు బయటపడడానికి 2 నుంచి 14 రోజుల సమయం పడుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్వారంటైన్ బాధ్యతలను ఫీల్డ్లెవెల్ ఆరోగ్య కార్యకర్తలకు అప్పగించనున్నారు. వీరు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, లక్షణాలు బయటపడితే దవాఖానాలకు తరలిస్తారు.

విదేశాల నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులు ముందుజాగ్రత్త చర్యగా కుటుంభం సభ్యులను, బయటి వ్యక్తులను కలవొద్దని ఈటెల సూచించారు. ఆరోగ్యశాఖ నుంచి కాల్స్ వస్తే అన్ని వివరాలు చెప్పాలని కోరారు.

కరోనా భయం పోయేవరకూ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు.కాన్ఫరెన్సులు, సెమినార్లను కొద్దిరోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో కరోనాపై వదంతులను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డిని కోరారు.

ప్రస్తుతం గాంధీలో కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular