జాతీయ వార్తలుDeccan Chronicle Venkatarami Reddy: బ్రేకింగ్ : ఆ పత్రిక ఎండీ అరెస్ట్... వెనుక సంచలన...

Deccan Chronicle Venkatarami Reddy: బ్రేకింగ్ : ఆ పత్రిక ఎండీ అరెస్ట్… వెనుక సంచలన నిజాలు

Deccan Chronicle Venkatarami Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అధికారుల సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపడుతున్న అధికారులు.. మనీలాండరింగ్ కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న దక్కన్ క్రానికల్ ఎండి వెంకటరామిరెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం చెలరేగింది. వెంకటరామిరెడ్డి మనీలాండరింగ్ కు పాల్పడ్డట్టు, బ్యాంకులను మోసం చేసినట్టు రుజువులు లభించడంతో ఈడి అధికారులు ఆయనను అరెస్టు చేశారు. గతంలో మనీలాండరింగ్ కు పాల్పడినట్టు సిబిఐ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై విచారణ జరిపిన ఈడి అధికారులు.. బుధవారం ఉదయం తమ కార్యాలయానికి వెంకటరామిరెడ్డిని పిలిపించారు. ఈ కేసుకు సంబంధించి రుజువులు లభ్యం కావడంతో ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.

మోసాలు

దక్కన్ క్రానికల్ పేపర్ ఓనర్ వెంకటరామిరెడ్డి కి పలు వ్యాపారాలు ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు దక్కన్ చార్జర్స్ అనే క్రికెట్ టీం ను కూడా కొనుగోలు చేశాడు. ఇతడి బ్యాంకు మోసాలు వెలుగులోకి రావడం, నష్టాలు భరించలేని స్థాయికి చేరుకోవడంతో ఆ టీం ను సన్రైజర్స్ జట్టుకు అమ్మేశాడు. ఆ తర్వాత తన సారధ్యంలో వెలువడే ఆంధ్రభూమి పత్రికను కూడా నిలిపివేశాడు. ఇక దక్కన్ క్రానికల్ లాభాల్లో ఉండడంతో దాన్ని మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈయనకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో 14 విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని కూడా ఈడీ అటాచ్ చేసింది. వెంకటరామిరెడ్డి బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ఆరు ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసింది. ఇక గతంలో 386 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. వెంకటరామిరెడ్డి తో పాటు మరో వ్యాపారవేత్త మణి అయ్యర్ ని కూడా ఈడీ అరెస్టు చేసింది.

విస్తరణ పేరుతో మోసం

వెంకటరామిరెడ్డి తన వ్యాపార విస్తరణ పేరుతో పలు బ్యాంకుల నుంచి 8800 కోట్ల అప్పును తీసుకున్నారు. అప్పు కు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు బ్యాంకులకు సమర్పించారు. బ్యాంకులకు నిర్ణీత సమయంలో వడ్డీ చెల్లించకపోవడంతో అవి నోటీసులు జారీ చేశాయి. నోటీసులు తప్పుడు అడ్రస్ కు వెళ్లడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించి వెంకటరామిరెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే ఈ వ్యవహారం భారీ మోసానికి చెందినది కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇందులోకి ఎంటర్ అయ్యాయి. అప్పటినుంచి దక్కన్ క్రానికల్ కు చెందిన పలు ఆస్తులను అటాచ్ చేశాయి. ఇక బ్యాంకులను మోసం చేసిన కేసులో సిబిఐ దాఖలు చేసిన ఫిర్యాదులకు సంబంధించి ఈడి అధికారులు బుధవారం వెంకటరామిరెడ్డిని, మణి అయ్యర్ ను అరెస్టు చేశాయి. వీరిద్దరూ కలిసి కావాలనే బ్యాంకులను మోసం చేసినట్టు ప్రకటించాయి. దక్కన్ క్రానికల్ ఆస్తుల విలువ మరింత పెంచి చూపించి మణి అయ్యర్ బ్యాంకులను బురిడి కొట్టించాడని ఈడీ అధికారులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం దక్కన్ క్రానికల్ ఎండి అరెస్టు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Venkatarami Reddy: మందుతో దొరికిపోయిన జగన్ విధేయ ఉద్యోగ సంఘ నేత

వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు ఉద్యోగ సంఘాల నేతలు. వారిని అడ్డం పెట్టుకుని ఉద్యోగుల వ్యతిరేకతను అధిగమించాలని జగన్ భావించారు. కానీ ఉద్యోగులు వారి మాటను నమ్మలేదు. ఈ ఎన్నికల్లో తమ ప్రతాపాన్ని చూపించారు.

Deccan Chronicle Attack: దక్కన్ క్రానికల్ పత్రికపై టీడీపీ ఎందుకు దాడి చేసింది? ఏంటా కథనం? ఎందుకు వివాదమైంది?

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం గత కొన్నేళ్లుగా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేసింది. తప్పకుండా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని సాక్షాత్ కేంద్రమంత్రులు చాలాసార్లు ప్రకటించారు. దీనిపై ఉద్యమం పతాక స్థాయికి చేరింది. బిజెపి మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అయితే అప్పట్లో నిరసన కార్యక్రమాల్లో వైసీపీ సైతం పాల్గొంది.

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...