Homeఅంతర్జాతీయంఅమెరికాపై కరోనా పంజా.. ప్రజలు గజగజ

అమెరికాపై కరోనా పంజా.. ప్రజలు గజగజ

COVID 19 cases risesకరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రోజురోజుకు వైరస్ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతున్నా కరోనా ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ప్రపంచాన్ని కలవరపెడుతూ 24 గంటల వ్యవధిలో 88,376 కేసులు వెలుగు చూడడంతో అమెరికా వాసుల్లో ఆందోళన నెలకొంటోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతున్నా దేశవ్యాప్తంగా 55 శాతం మించి ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారున్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంటోంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా అమెరికాలోనే కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. జులై 25తో ముగిసిన వారంలో అగ్రరాజ్యంలో 5 లక్షలకు పైగా కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఇది 131 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ వారానికి సగటు కొత్త కేసుల సంఖ్య 60 వేలకు పైగా ఉంటోంది. జూన్ నెలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడంతోనే కేసుల సంఖ్య పెరుగున్నాయని తెలుస్తోంది. కరోనా ఉధృతికి వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడమే కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వైరస్ తీవ్రత కారణంగా మాస్కులు ధరించాలని సూచిస్తోంది. ప్రజలు గుంపులుగా తిరగొద్దని చెబుతున్నారు.

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రభావితమైన దేశం అమెరికానే. కరోనా వైరస్ తో గడగడలాడిన దేశం ఎంతో నష్టపోయింది. ఇక్కడ ఇప్పటివరకు 6.12 లక్షల మందిని బలితీసుకుంది. దాదాపు 3.5 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో కరోనా ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాణాలు గాల్లో కలుస్తున్న వైనంపై నానా తిప్పలు పడుతున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular