ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య గంట గంటకి పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రికి 44 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం రాత్రికి 111 కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయానికల్లా 132 కేసులను నిర్థారించింది.
రాష్ట్రంలోనే తొలికేసు నమోదైన నెల్లూరు జిల్లా.. ఇప్పుడు అత్యథిక కేసులున్న జిల్లాగా కూడా మారింది. నెల్లూరు జిల్లాతోపాటు, గుంటూరు జిల్లాలో కూడా 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 12గంటల వ్యవధిలో మరో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 17, కడపలో, కృష్ణా జిల్లాల్లో 15మంది చొప్పున బాధితులున్నారు.
మార్చి 13, 14, 15 తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ లో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ వీరిలో ఉన్నారు.