ప్రజలు స్వీయ దిగ్బంధనం పాటించేటట్లు అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేస్తూ ఎవరైనా మాట వినని పక్షంలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించడంతో పాటు కనిపిస్తే కాల్చివేత్త ఉత్తరువులు ఇవ్వవలసి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరుపుతూ అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దింపవలసి వస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని రక్షించుకునే దిశలో ఏ నిర్ణయం అయినా తీసుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. సాటి మనుషులకు..సమాజానికి ఇబ్బందులు వచ్చేలా ప్రవర్తిస్తే వారికి ఉన్న అన్నీ లైసెన్సులు రద్దు చేయబడతాయని చెప్పారు.
‘రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో పౌర బాధ్యతలను పాటించాలి. ఎవ్వరికీ మినహాయింపు లేదు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కఠినమైన నిబంధనలను పాటించక తప్పదు’ అని కలెక్టర్లకు సూచించారు. జనం గుంపు గుంపులుగా ఉండకుండా చూడాలని చెబుతూ ప్రజల అత్యవసర అవసరల పట్ల పోలీస్లు జాగ్రత్తగా వ్యవహరించమని హితవు చెప్పారు.
జిల్లా హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి జాబితాను దగ్గర పెట్టుకోవాలని, కలెక్టర్లు జిల్లా లోని అన్నీ ఆసుపత్రిలను సందర్శించాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంఖ్యని బట్టి డ్యూటీలు వేయాలని, సామాజిక స్పృహ ఉన్న వారిని కంట్రోల్ రూమ్లో పెట్టాలని, ప్రజలతో మంచిగా మాట్లాడాలని సూచించారు.
కరోనా లక్షణాలున్న అనుమానితులను హైదరాబాద్లో పరీక్షించి ..పాజిటివ్ వస్తే ఇక్కడే చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రష్యాలో కఠినంగా ఉంటూ, హైరిస్క్ తీసుకున్నారు కాబట్టి..ఒక్క కేసు పాజిటివ్ లేదని గుర్తు చేశారు.
కరోనా వైరస్ తగిలిచుకుంటే తప్ప…దాని అంతటా వచ్చే వ్యాధి కాదని ఆయన స్పష్టం చేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా బయటకి రావద్దని స్పష్టం చేశారు. అన్నీ నిత్యావసర సరుకుల దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు మూసి వేయాలని సూచించారు. మాట వినకపోతే సీజ్ చేసి.. మూసి వేయాలని కలెక్టర్కు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Cm kcr press meet on telangana lockdown
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com