Homeజాతీయ వార్తలుCJ Party 2.0 : సీజేపీ 2.0.. కాక్రోచ్ ల కుట్రను మోడీ చేధిస్తాడా?

CJ Party 2.0 : సీజేపీ 2.0.. కాక్రోచ్ ల కుట్రను మోడీ చేధిస్తాడా?

CJ Party 2.0 కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన మొదటి ఆందోళన విజయవంతమైన తర్వాత రెండో దశకు సిద్ధమవుతోంది. జూలైలో జంతర్‌మంతర్‌లో నిరాహార దీక్ష, సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష, పార్లమెంటు ముట్టడి యత్నం వంటి చర్యలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా, ప్రధాని మోదీ సీజేపీ నేతలతో చర్చలు వంటి పరిణామాలు జరిగాయి. అయినా వారి అసలు లక్ష్యం మోదీ రాజీనామా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తరహా ‘రెజీమ్‌ […]

CJ Party 2.0 కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన మొదటి ఆందోళన విజయవంతమైన తర్వాత రెండో దశకు సిద్ధమవుతోంది. జూలైలో జంతర్‌మంతర్‌లో నిరాహార దీక్ష, సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష, పార్లమెంటు ముట్టడి యత్నం వంటి చర్యలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా, ప్రధాని మోదీ సీజేపీ నేతలతో చర్చలు వంటి పరిణామాలు జరిగాయి. అయినా వారి అసలు లక్ష్యం మోదీ రాజీనామా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తరహా ‘రెజీమ్‌ చేంజ్‌’ చేయాలన్న లక్ష్యం నెరవేరలేదు. దీనిని సాధించేందుకు సెప్టెంబర్‌ 5న ఇండియా గేట్‌ వద్ద కొత్త ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నారు.

రెండో దశ లక్ష్యం మారలేదు
మొదటి దశలో జంతర్‌మంతర్‌ను ఎంచుకుని నిరసనలు నిర్వహించి కొంత విజయం సాధించారు. అయితే పూర్తి రాజకీయ మార్పు కోసం ఇప్పుడు ఇండియా గేట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీ తీస్తామని ప్రకటించారు. అనుమతి కోసం ఎలాంటి లేఖ రాయలేదు. సెక్షన్‌ 144 అమలులో ఉండే అవకాశం ఉన్నా, లాఠీచార్జి, గాయాలు, మీడియా కవరేజ్‌ ముఖ్యంగా అంతర్జాతీయ మీడియా కోసం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. గతేడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ నడిరోడ్డుపై మఫ్లర్‌ కట్టుకుని పడుకుని, మిలటరీ కవాతు వచ్చినప్పుడు పారిపోయారు. ఇప్పుడు ఇదే తరహా ‘డ్రామా’ను ప్లాన్‌ చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.

జంతర్‌మంతర్‌ నుంచి పాఠాలు..
మొదటి ఆందోళనలో ఢిల్లీ పోలీసులు ఉద్యమాన్ని తక్కువగా అంచనా వేశారు. జూలై 20–24 మధ్య జనసమూహం రావడం, మధ్యలో కమిషనర్‌ మార్పు, ఇంటలిజెన్స్‌ ఆలస్యంతో అల్లర్లు జరిగాయి. జంతర్‌మంతర్‌ గోడలు కూడా బద్దలయ్యాయి. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా సీఐఎస్‌ఎఫ్, ఇండో–టిబెట్‌ బార్డర్‌ పోలీస్‌ బలగాలను మోహరించారు. ఇండియా గేట్‌ చుట్టూ కఠిన భద్రతా చర్యలు, సమీప ప్రాంతాల్లో కూడా నిఘా పెంచారు. ప్రభుత్వం స్పష్టంగా జంతర్‌మంతర్‌ లేదా రామలీలా మైదానంలోనే నిరసనలు చేసుకోవాలని సూచించింది. ఇతర ప్రాంతాల్లో అనుమతి దొరకదు.

బ్రిక్స్‌ సదస్సు నేపథ్యం ప్లాన్‌..
బ్రిక్స్‌ సదస్సుకు ముందు ఈ ఆందోళన చేపట్టడం భారత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అని అంచనా. ర్యాలీలో ఎవరెవరు పాల్గొంటారు, ఎంత మంది వస్తారు అనే ఇంటలిజెన్స్‌ సేకరిస్తున్నారు. జైపూర్‌కు చెందిన సీజేపీ నాయకుడు అసుతోష్‌ రాంక తన ఇంటి చుట్టూ నిఘా పెరిగిందని ఆరోపిస్తున్నా, కాలనీవాసులే అనుమానితుల రాకపోకల గురించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సౌరవ్‌ దాస్‌ కూడా నిఘాలో ఉన్నాడు. అతను తండ్రి పేరు వేర్వేరుగా పెట్టడం, అధిక అద్దె చెల్లింపులకు సమాధానం లేకపోవడం, ముంబైలో అమర జవాన్‌ స్మారకం ధ్వంసం చేసిన చరిత్ర వంటి అంశాలు దృష్టిలో ఉన్నాయి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న వ్యక్తిగా అతన్ని చూస్తున్నారు.

చట్టంతో రాజకీయం..
సీజేపీ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఆందోళన చేయాలని భావిస్తోంది. ఇది మీడియా దృష్టిని ఆకర్షించి, హింసాత్మక దృశ్యాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలనే వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు, కేంద్రం ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జంతర్‌మంతర్‌ మాత్రమే అధికారిక నిరసన ప్రాంతం అనే స్పష్టత, భద్రతా బలగాల పెంపు, నాయకుల కదలికలపై నిఘా ఇవన్నీ మొదటి దశలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా నివారించే ప్రయత్నాలు.

మొత్తంగా చూస్తే, సీజేపీ రెండో ఆందోళన ‘డ్రామా, మీడియా’పై ఆధారపడి ఉంది. ప్రభుత్వం మాత్రం చట్టం, భద్రతా చర్యల ద్వారా నియంత్రణలో ఉంచాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్‌ 5 నాటి పరిణామాలు ఢిల్లీ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌ ఇవ్వగలవు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper