Pawan Kalyan yatra: ఈ దసరా నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ కోసం ప్రత్యేక ఒక బస్ ను తయారు చేస్తుండడం విశేషం. హైదరాబాద్ లో తయారు చేస్తున్న ఈ బస్సు ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలి ఉంది. ఇప్పటివరకూ బస్ యాత్ర చేసిన వివిధ పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేయడం విశేషం.

రెగ్యులర్ బస్ లు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి వాడారు. వర్క్ షాప్ లో స్పెషల్ గా తయారు చేస్తున్న ఈ బస్ ఎక్స్ క్లూజివ్ ఫొటోలు మీడియాకు దొరికాయి. తుది దశ హంగులు అద్దుకుంటున్న ఈ బస్సును ఈ నెల 26 వరకూ పూర్తి స్థాయిలో రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ బస్సుపైన పవన్ ప్రసంగించడానికి వీలుగా చుట్టూ రక్షణ రెయిలింగ్ లు.. బస్సులో పవన్ బస చేసేలా.. ఆయన కాలకృత్యాలకు ఏర్పాట్లు. బెడ్. మాట్లాడడానికి సరిపిడా స్థలం.. టీవీ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక బస్ కు ప్రత్యేకంగా సౌండ్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. ఎంత దూరంలో ఉన్న వారికి కూడా పవన్ కనిపించేలా బస్ టాప్ లో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈయాత్ర జరిగినన్నీ నాళ్లు పవన్ ఈ బస్ లోనే ఉంటారు కాబట్టి ఆయన అలవాట్లు, అవసరాలకు తగినట్లుగా ఇందులో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నారు. 18న మంగళగిరిలో యాత్రపై కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి..? రూట్ మ్యాప్ సిద్ధం చేస్తారు. వైసీపీని ఓడించడం.. జనసేనను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పవన్ ఈ యాత్ర చేపట్టబోతున్నారు.