BJP Operation Lotus strategy: అప్పట్లో బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు చికెన్ నెక్ రహదారి విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వ్యక్తిగతంగా అమిత్ షా రిక్వెస్ట్ చేసినప్పటికీ మమత కరగలేదు. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల మీద ఉల్టా కేసులు పెట్టింది. బెంగాల్లో అడుగుపెట్టిన వారి మీద దాడి చేసింది.
ఢిల్లీలో అప్పట్లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి జండా ఎగరవేసిన తర్వాత.. ఎర్రకోట మీద ఖలిస్తాన్ వేర్పాటు వాదులు జెండా ఎగరవేశారు. అప్పట్లో ఈ చర్యను ఆప్ ప్రభుత్వం సమర్ధించింది. అదే కాదు పంజాబ్ నుంచి.. హర్యానా నుంచి కొంతమంది ప్రతీప శక్తులు ఢిల్లీ రావడానికి కారణమైంది.
మహారాష్ట్రలో శివసేన అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకుల మీద విపరీతంగా కేసులు పెట్టారు. కొన్ని సందర్భాలలో వేరే శక్తులకు అవకాశం కల్పించారు. తద్వారా భారత ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అంతేకాదు, మాఫియా శక్తులు బలపడేందుకు శివసేన కారణమైందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.
ఇవన్నీ కూడా మోడీకి.. అమిత్ షా కు చికాకు కలిగించాయి. అందువల్లే ఈ దారుణాలకు ప్రాంతీయ పార్టీలు కారణమని వారు బలంగా నమ్మారు. పైగా దేశంలో జరుగుతున్న ఘోరాలకు.. అవాంఛనీయ సంఘటనలకు ప్రాంతీయ పార్టీలు దోహదం చేస్తున్నాయని వారిలో ఒక నమ్మకం ఏర్పడింది. ఇక అప్పటినుంచి వారు ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టారు.
కొన్ని సంవత్సరాల క్రితమే మహారాష్ట్రలో శివసేన పార్టీని నిలుపునా చీల్చి పడేశారు మోడీ, షా. ఇప్పుడు ఏకంగా ఉద్దవ్ వర్గంలో ఉన్న 9 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురిని ఆకర్షించారు. కాకపోతే వారు నేరుగా బిజెపిలో చేరకుండా.. ఇతర పార్టీలో చేరబోతున్నారు. ఆ తర్వాత బీజేపీలోకి చేరడానికి ఆస్కారం కల్పిస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో మహారాష్ట్రలో చెప్పుకునే స్థాయిలో బిజెపి పార్లమెంటు స్థానాలను గెలుచుకోలేకపోయింది. అందువల్లే తమకు ప్రతిబంధకంగా ఉన్న శివసేనను మరొకసారి చీల్చి పడేసే పనిని భుజాలకు ఎత్తుకున్నారు మోడీ, షా.
పశ్చిమ బెంగాల్లో టిఎంసి పార్టీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో ఇప్పుడు 20 మంది బయటకు వచ్చారు. వారంతా నేరుగా బిజెపిలో చేరలేదు. ఎన్ సి పి ఐ పార్టీలో చేరారు. వీరంతా దశలవారీగా మళ్లీ బిజెపి తీర్థం పుచ్చుకుంటారు. కేవలం ఎంపీలు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు కూడా దాదాపు 58 మంది వేరే కుంపటి పెట్టారు. ప్రతిపక్షంగా తమనే గుర్తించాలని ఇప్పటికే స్పీకర్ కు లెటర్ రాశారు.
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కంటే ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతమంది రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు. దీంతో ఎగువ సభలో బిజెపికి బలం పెరిగింది. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను చీల్చివేయడం.. రాజ్యసభ సభ్యులను.. పార్లమెంట్ సభ్యులను చేర్చుకోవడం ద్వారా బిజెపి గెట్టి ప్లాన్ వేసింది. ఇదంతా కూడా పార్లమెంట్లో 2/3 మెజారిటీ కోసం.. ఎందుకంటే ప్రస్తుత ఎన్డీఏ భుత్వం టిడిపి, నితీష్ కుమార్ సపోర్ట్ తో నడుస్తోంది. ఆల్రెడీ బీహార్ లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బిజెపి అభ్యర్థి ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది.. ఇన్ని సానుకూలతలు కనిపిస్తున్న నేపథ్యంలో బిజెపి పెద్దలు వేసిన స్కెచ్ భారీగానే ఉంది.
పార్లమెంట్లో బలం పెంచుకోవడం.. అప్పర్ హౌస్ లో మరింత స్ట్రాంగ్ గా ఉండడంతో కీలకమైన బిల్లులు ఆమోదింప చేసుకోవాలని మోడీ, షా భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు.. డిలిమిటేషన్.. ఇంకా చాలా బిల్లులు ఈ టర్ములోనే పూర్తి చేసుకొని.. 2027 లేదా 2028 ఎన్నికలకు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని మోడీ, షా భావిస్తున్నారు.. బీహార్ లో జేడీయు.. ఆంధ్రప్రదేశ్లో టిడిపి ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్నాయి. అలాంటప్పుడు ఆ పార్టీల కోరికలు తీర్చాల్సిన అవసరం లేకుండానే.. బిజెపి ఇలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసి.. ఓడిస్తోందని.. ఆ పార్టీల ఎంపీలను కలిపేసుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ లోటస్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. దీనిని ఆపే ప్రయత్నం గాని.. ఆపే సాహసం గాని ఎవరూ చేయడం లేదు. ఎందుకంటే మోడీ, షా తలుచుకుంటే ఏం చేస్తారో వారికి తెలుసు.
