
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభించిన సీఎం కేసీఆర్ కి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు. కొండపోచమ్మ సాగర్ గొప్ప ముందడుగు. జలాశయం ద్వారా రైతులకు సాగునీరు, గృహాలకు మంచినీరు అందుతాయి.’ అని ఎంపీ ట్వీట్ చేశారు.
కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్ దంపతులు ప్రారంభించారు. మర్కూక్ పంప్ హౌస్ నుంచి ఈ రిజర్వాయర్ లోకి గోదావరి నీరు చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుతఘట్టం ఆవిషృతమైంది. కొండపోచమ్మ సాగర్ కి నీరు చేరికతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి.