విశాఖ తీరం.. అందాల సాగరం. అందాలకు పెట్టింది పేరు. విశాఖ బీచ్ ను తీర్చిదిద్దేందుకు సంబంధించిన అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ర్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు నేతృత్వంలో పనులు మొదలు కానున్నాయి. సాగర అందాలతో మైమరపించే విశాఖ నగరానికి మరిన్ని సొబగులు అద్దేందుకు రాష్ర్ట ప్రభుత్వం సంకల్పించింది. రుషికొండ-భోగాపురం మధ్య మరో పది బీచ్ లు ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.
ఒక్కో బీచ్ ను రూ.2.50 కోట్లతో రాస్ర్ట పర్యాటకాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయనుంది. వివాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చే నిధులతో తొలిదశలో ఐదు బీచ్ లను సిద్ధం చేయనుంది. రెండో దశలో మిగిలిన బీచ్ లను అభివృద్ధి చేస్తారు. విశాకలో ఇప్పటికే ఆర్కే బీచ్, రుషికొండ, యాదాడ బీచ్ లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
విశాఖ నుంచి బీమునిపట్నం మీదుగా భోగాపురం వరకు ఆరు లైన్ల రహదారి అభివృద్ధిలో భాగంగా తీరం వెంబడి కొత్త బీచ్ లు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తీర ప్రాంత నియంత్రణ జోన్ నిబంధనలకు లోబడి ఆయా బీచ్ ల్లో తాత్కాలిక నిర్మాణాలతో సదుపాయాలు కల్పించనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్త అధికారులు చెబుతున్నారు.
సాగర్ నగర్, తిమ్మాపురం, మంగమూరిపేట, చేపలుప్పాడ, ఐఎన్ఎన్ కళింగ, ఎర్రమట్టి దిబ్బలు, బీమునిపల్నం, నాగాయంపాలెం, అన్నవరం, కంచేరుపాలెం కొత్తగా ఏర్పాటు చేసే బీచ్ ల్లో ఫుడ్ కోర్టులు, పిల్లల క్రీడాపార్కులు, నడక మార్గాలు, ఫిట్ నెస్ కు సంబందించిన పరికరాలు, స్నానాల గదులు, తాగునీటి సదుపాయం, సురక్షిత స్విమ్మింగ్ జోన్లు బీచ్ క్రీడలు, వాచ్ టవర్, సీసీ టీవీ కంట్రోల్ రూం, ప్రాథమిక వైద్యం మొదలైన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో కొత్త బీచ్ లను వీలైనంత త్వరలో ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.