Homeఆంధ్రప్రదేశ్‌కన్నాపై అంబటి సంచలన ఆరోపణ!

కన్నాపై అంబటి సంచలన ఆరోపణ!


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసిపి అదికార ప్రతినిది, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రి అయ్యారని, ఆ సమయంలో కన్నా ముఖ్యమంత్రి పదవిలోకి రావాలని డిల్లీలో కాంగ్రెస్ నేత ఒకరికి ఇరవై కోట్లు ముట్టచెప్పారని ఆయన ఆరోపించారు. అయితే ఆ తర్వాత కన్నాకు ఆ నేత టోపి పెట్టారని అన్నారు. ఈ విషయమై కన్నా కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్దమా అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాదని నమ్మిన వారిని నట్టేట ముంచే చరిత్ర కన్నాకు ఉందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఇచ్చిన డబ్బుకు పార్టీకి లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. ఈ అంశంపై అదిష్టానం ఆగ్రహంతో ఉందన్నారు. ఆ సంగతి తెలిసి కన్నా ఈ రకంగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడానికి కన్నా సిద్దం అయి, ఆ తర్వాత గుండెపోటు వచ్చిందని ఆస్పత్రిలోకి చేరానని, నిజంగా గుండెపోటు వచ్చిందని ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు అమ్ముడు పోలేదని ప్రమాణం చేయగలరా అని కన్నా ప్రశ్నించారని, ప్రమాణం చేయడానికి విజయసాయిరెడ్డి తాను సిద్దంగా ఉన్నారని రాంబాబు తెలిపారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular