spot_img
Homeజాతీయ వార్తలుAdani power plant : అదానీ పుట్టి మునిగే ప్రమాదం.. తెర పైకి మరో...

Adani power plant : అదానీ పుట్టి మునిగే ప్రమాదం.. తెర పైకి మరో మాయాజాలం

Adani power plant  : హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అదానీ గ్రూప్‌ పుట్టి మునిగే ప్రమాదం కన్పిస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్‌కు సంబంధించిన పలు కంపెనీల షేర్లను మదుపుదారులు అమ్మేస్తున్నారు. మరోవైపు జాతీయ బ్యాంకులు తప్ప మిగతా సంస్థలు రుణాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో నగదు లభ్యత లేక కంపెనీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. లాజిస్టిక్స్‌ తప్ప మిగతా రంగాలన్నీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.

మరో మాయాజాలం వెలుగులోకి

అదానీ గ్రూప్‌ మరో మాయాజాలం వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని ముంద్రాలో ఏర్పాటు చేసిన భారీ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పీకల్లోతు నష్టాల్లో ఉన్నా.. ఆ ప్లాంట్‌కు ఉదారంగా అదానీ పవర్‌ అనుబంధ సంస్థ నుంచి 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8,250 కోట్లు) రుణాలు సమకూర్చింది. ఆడిటర్ల అభ్యంతరాలను సైతం కాదని అదానీ గ్రూప్‌ పెద్దలు రుణ పత్రాల రూపంలో ముంద్రా ప్లాంట్‌కు ఉదారంగా ఈ రుణం సమకూర్చారు. ఈ రుణాల చెల్లింపులకు ఎలాంటి హామీ లేదు. అదానీ పవర్‌ అడిగితే మాత్రం ఏటా 10ుచొప్పున వడ్డీ చెల్లించాలి.

అసలుకే మోసం వచ్చే ప్రమాదం

అదానీ పవర్‌ మొత్తం ఆస్తుల్లో ముంద్రా ప్లాంట్‌ వాటా నాలుగో వంతు వరకు ఉంటుంది. రూ.14,718 కోట్ల భారీ నష్టాలతో ఉన్న ఈ ప్లాంట్‌ పుట్టి మునిగితే ఆ ప్రభావం అదానీ పవర్‌ కంపెనీ ఇన్వెస్టర్లపైనా పడుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 4,620 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఏదోలా ప్లాంట్‌ను నడపాలనే ఉద్దేశంతో అదానీ గ్రూప్‌ ఈ ప్లాంట్‌ నడుపుతోంది. ప్రస్తుతం తన ఉత్పత్తి సామర్ద్యంలో 20 శాతానికి మించి ఉపయోగించుకోలేకపోతోంది. దీంతో ఏటికేటికి నష్టాలు పెరిగి పోతున్నాయి.

ప్లాంట్‌ చరిత్ర:

విద్యుత్‌ రంగంలోకి ప్రైవేటు రంగాన్ని అనుమతించడంతో 15 ఏళ్ల క్రితం అదానీ గ్రూప్‌ 4,620 మెగావాట్ల భారీ సామర్ధ్యంతో గుజరాత్‌లోని ముంద్రాలో ఈ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. ఇండోనేషియాలోని తన బొగ్గు గనుల నుంచి ఈ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు సరఫరా చేయాలని అదానీ గ్రూప్‌ తొలుత భావించింది. అయితే ఇండోనేషియా ప్రభుత్వం తన దేశం నుంచి ఎగుమతి చేసే బొగ్గుకు కనీస ధర నిర్ణయించడంతో అదానీ పథకం బెడిసి కొట్టింది. పోనీ పెరిగిన ధరతో ప్లాంట్‌ నడిపి, విద్యుత్‌ అమ్ముదామా? అంటే కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో రూ.14,718 కోట్ల భారీ నష్టాలతో ముంద్రా ప్లాంట్‌ అదానీ గ్రూప్‌నకు పెద్ద గుదిబండలా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper