
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100కోట్ల ఫోన్లుకు హ్యాకింగ్ రిస్క్ ఉన్నట్లు కన్జ్యూమర్ వాచ్ డాగ్ ‘విచ్’ హెచ్చరికలు జారీచేసింది. యూజర్లు వెంటనే తమ డివైస్ ల సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
ప్రపంచ వ్యాప్తంగా 42.1 శాతం యూజర్లు ఆండ్రాయిడ్ 6, అంతకంటే కిందిస్థాయి ఓఎస్ లను వినియోగిస్తున్నారని గూగుల్ డేటాలో తేలింది. ఓల్డ్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ను వినియోగించడం, ఆదే విధంగా ఓఎస్ లతో నడుస్తున్న డివైస్ లు సెక్యూరిటీ అప్ డేట్స్ను సపోర్ట్ చేయకపోవడం వల్ల అవన్నీ హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉంది. హ్యాకర్లు వాటిలోని డేటా దొంగిలించడం, ర్యాన్సమ్ వేర్ (డేటాను దొంగిలించి డబ్బులు డిమాండ్ చేయడం), మాల్వేర్ ఎటాక్ లాంటి వాటికి పాల్పడే ప్రమాదం ఉంది.
హ్యాకింగ్ కి దొరకకుండా యూజర్లు ఏమిచేయాలంటే..
- మీ ఫోన్ కొని రెండేళ్ల దాటితే.. ఓఎస్ పాతదా? కొత్తదా? చెక్ చేసుకోండి. ఓల్డ్ వెర్షన్ ఓఎస్ అయితే వెంటనే అప్ డేట్ చేసుకోండి.
- మీ ఫోన్ ఈ మధ్యే కొన్నారా.. అయితే కంగారేమి లేదు. అనుమానం ఉంటె ఓఎస్ ని చెక్ చేయించుకోండి.
- ఫోన్ ఓఎస్ 7.0 కంటే ముందుది అయితే అప్ డేట్ చేసుకునేందుకు ప్రయత్నించండి.
- ముఖ్యంగా ఆండ్రాయిడ్ 4, అంతకుముందు ఓఎస్ ఉన్న డివైస్ లను వాడుతున్న యూజర్లు జాగ్రత్తగా ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తప్ప.. మరే ప్లాట్ ఫామ్ నుంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దు.
- అనుమానాస్పద ఎస్సెమ్మెస్ లు, ఎంఎంఎస్ ల విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి.
- యాప్ ద్వారా మొబైల్ యాంటీ వైరస్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. అయితే ఇది పూర్తిస్థాయి సెక్యూరిటీని ఇస్తుందని చెప్పలేం.