Homeకరోనా వైరస్ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్..?

ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్..?


భారత్ లో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహా ఆఘాడీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులకు కరోనా నెగిటివ్ వస్తేనే అనుమతిస్తామని తెలిపింది. ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్లు ఉంటే మాత్రమే రాష్ట్రంలోకి రావాలని సూచనలు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు కరోనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ లో ఉండాలని సూచనలు చేసింది.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగితే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే రాష్ట్రంలో మళ్లీ కఠినంగా ఆంక్షలు అమలు చేసే పరిస్థితి తలెత్తవచ్చని తెలిపారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఆంక్షలను అమలు చేయడానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.

మాహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 72 గంటల క్రితం పరీక్షలు చేయించుకుంటే మాత్రమే ఆర్టీ పీసీఆర్ రిపోర్టులు సైతం చెల్లుబాటు అవుతాయని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 4,153 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,84,361కు చేరింది. రాష్ట్రంలో కరోనా డిశ్చార్జ్ కేసుల సంఖ్య 16,54,793కు చేరగా మృతుల సంఖ్య 46,653గా ఉంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 81,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వచ్చే నెల 6వ తేదీన ముంబైలోని చైత్యభూమిలో జరిగే అంబేద్కర్ 64వ మహా పరినిర్వాణ్‌ దిన్‌ వేడుకలకు రావద్దని కోరారు. ప్రజలు ఇళ్ల నుంచే అంబేద్కర్ కు నివాళులు అర్పించాలని సూచనలు చేశారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular