Venkatesh and director controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ పేరు చెబితే చాలు ఫ్యామిలీ సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఎందుకంటే అతను ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకులను థియేటర్ కి రప్పించాడు. ముఖ్యంగా ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. శోభన్ బాబు తర్వాత ఆ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన నటుడు కూడా తనే కావడం విశేషం… వెంకటేష్ సినిమా పండక్కి వచ్చిందంటే ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అవతలిపక్క ఏ హీరో ఉన్నా కూడా వెంకటేష్ సినిమా చూసిన తర్వాతే ఫ్యామిలీ ఆడియన్స్ మిగతా వాళ్ళ సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఇక గత సంవత్సరం సంక్రాంతికి పండక్కి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించిన ఘనత అతనికే దక్కింది… అలాంటి వెంకటేష్ ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
డైరెక్టర్ తేజ వెంకటేష్ తో 10 సంవత్సరాల క్రితం నుంచి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ సినిమా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కారణం ఏదైనా కూడా తేజ కి వెంకటేష్ వాళ్ళ అన్నయ్య సురేష్ బాబుకి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే రానా ని హీరోగా పెట్టి ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేశాడు.
ఆ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక సురేష్ బాబు చిన్న కొడుకు అయిన అభిరామ్ ను హీరోగా పెట్టి అహింస మూవీ చేశాడు. వెంకటేష్ తో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో తేజఉన్నారట. గతంలో వెంకటేష్ కి ఒక మంచి కథను వినిపించినప్పటికి అది చివరి నిమిషంలో పట్టాలెక్కలేదు. మరి ఎందుకని వీళ్ళ కాంబినేషన్లో సినిమా సెట్ అవ్వడం లేదనే ధోరణిలో కూడా వెంకటేష్ సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఇక వెంకటేష్ తేజ కాంబినేషన్లో ఒక సినిమా పడితే ఆ మూవీకి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే దక్కుతుంది…
