Vijay Deverakonda Rashmika Wedding Food Viral: 8 ఏళ్ళ సుదీర్ఘ ప్రేమ బంధాన్ని నేడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda ), రష్మిక(Rashmika Mandanna) జంటలు శాశ్వత వివాహ బంధం గా మార్చుకున్నారు. వీళ్ళ పెళ్లి నేడు ఉదయం 10:10 నిమిషాలకు జరిగినట్టు తెలుస్తోంది. ఈ వివాహానికి ఈ జంటకు బాగా దగ్గరైన మిత్రులు , సన్నిహితులు , కుటుంబ సభ్యులు హాజరయ్యారు . మన సినీ పరిశ్రమ నుండి సందీప్ రెడ్డి వంగ, అల్లు అర్జున్ వంటి వారు హాజరు అయ్యినట్టు తెలుస్తోంది. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు . విజయ్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పెళ్లి పీటల ఫోటోలను తన స్టోరీ లో అప్లోడ్ చేసాడు . మరో పక్క రష్మిక కూడా కొన్ని ఫోటోలను స్టోరీ లో అప్లోడ్ చేస్తూ ఉంది. కానీ ముఖ్యమైన ఫోటోలను మాత్రం ఇంకా బయటకు వదల్లేదు .
అయితే ఈ పెళ్లిలో స్పెషల్స్ మాత్రం సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అవుతున్నాయి . శాఖాహారులు , మాంసాహారులకు కావాల్సినన్ని ఐటమ్స్ ని ఏర్పాటు చేశారు. హైదరాబాదీ ధమ్ బిర్యాని , తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ , నాటు కోడి పులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఇలా ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఈ పెళ్ళిలో ఏర్పాటు చేశారట. చాలా మంది పండి మాంసం కూడా ఇష్టపడి తినేవాళ్లు ఉన్న సంగతి తెలిసిందే , వాళ్ళ కోసం పోర్క్ కర్రీ ని కూడా ఏర్పాటు చేశారట . దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అంతే కాదు పోర్క్ అంటే రష్మిక కి కూడా చాలా ఇష్టమట . గతంలో ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ తనకు కొడగు సంప్రదాయమైన పండి కూర తినడమంటే మహాఇష్టం అంటూ మాట్లాడిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: మార్చి 4 వ తేదీన విజయ్ – రష్మిక రిసెప్షన్ కి వచ్చే స్పెషల్ గెస్ట్ ఎవరంటే..?
ఇక శాఖాహారుల కోసం గారెలు , పప్పు , పచ్చిపులుసు , సాంబార్, రసం , ఇలా ఎన్నో రకాల వంటకాలు ఏర్పాటు చేశారట . వింటుంటేనే నోరు ఊరిపోతోంది కదూ, ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుంది మరీ. ఇకపోతే వీళ్లిద్దరి వెడ్డింగ్ రిసెప్షన్ వచ్చే నెల 4వ తేదీన హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులూ , వ్యాపార వేత్తలు, ఇలా అన్ని రంగాలకు చెందిన వారు హాజరు కాబోతున్నారు.