Trivikram Sentiment: పరిశ్రమలో సెంటిమెంట్స్ చాలా సాధారణం. దర్శకుడు త్రివిక్రమ్ కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన టైటిల్ ‘అ’ అక్షరంతో మొదలయ్యేలా జాగ్రత్తపడతారు. అత్తారింటికి దారేది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ఆయన ‘అ’ సెంటిమెంట్ వదల్లేదు. వరుసగా అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో అనే టైటిల్స్ తన చిత్రాలకు నిర్ణయించాడు. అజ్ఞాతవాసి మినహాయిస్తే ఈ చిత్రాల్లో అన్నీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ అయ్యింది. అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నేపథ్యంలో మహేష్ కోసం అదే తరహా టైటిల్ అనుకుంటున్నారట.

SSMB 28 మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం. గతంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా చిత్రాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఇక లేటెస్ట్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ చేశారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరిపారు. కాగా ఈ చిత్ర టైటిల్ ఇదే అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది . దాని ప్రకారం త్రివిక్రమ్ ”అయోధ్యలో అర్జునుడు” అని నిర్ణయించారట. తన సెంటిమెంట్ కలిసి వచ్చేలా టైటిల్ లో రెండు ‘అ’ లు ఉన్నాయి. టైటిల్ కూడా క్యాచీగా ఉంది.
ఈ క్రమంలో మహేష్ చిత్రానికి ‘అయోధ్యలో అర్జునుడు’ ఫిక్స్ అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ గట్టిగా ప్రచారం అవుతుంది. ఇక మహేష్ తో చేస్తున్న ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నదే అని సమాచారం. ఎన్టీఆర్ 30 త్రివిక్రమ్ తెరకెక్కించాల్సి ఉండగా ప్రకటన తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఆ స్క్రిప్ట్ మహేష్ తో చేస్తున్నారట. అప్పట్లో ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారమైంది. దానికి దగ్గరగా ‘అయోధ్యలో అర్జునుడు’ టైటిల్ ఉంది.

ఇక షూటింగ్ మొదలు పెట్టకుండానే మహేష్ మూవీ విడుదల తేదీ ప్రకటించేశాడు త్రివిక్రమ్. 2023 సమ్మర్ కానుకగా విడుదల చేస్తామని అధికారిక పోస్టర్ విడుదల చేశారు. మరి ఇంత తక్కువ సమయంలో పూర్తి చేసి విడుదల చేయగలరా అనే సందేహాలు ఉన్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుందని టాలీవుడ్ టాక్. మహేష్ మాత్రం డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.