Tamannaah Bhatia: ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు వ్యవధిలో విడుదల కావడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. తాజాగా తమన్నా నటించిన జైలర్ మూవీ, భోళా శంకర్ మూవీ రెండు కూడా ఒక రోజు గ్యాప్ లో మన ముందుకు రాబోతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వీర సింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాల్లో కూడా శృతి హాసన్ కధానాయిక నటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా అనేక విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఈ మధ్య తమన్నా బోల్డ్ గా, ఇంటిమెట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే, దీని గురించి మాట్లాడుతూ బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ చేయకపోతే ఆంటీని చేస్తారని తమన్నా పేర్కొన్నారు. కొత్త తరాన్ని టార్గెట్ చేసుకుని ఇలాంటి సీన్ లో నటిస్తున్నానని తమన్నా వెల్లడించడం గమనార్హం.
ఇలాంటి పాత్రలు చేయకపోతే నన్ను హీరోలకు అక్కగా, ఆంటీ గా చేసేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నేను బోల్డ్ గా చేయాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో కూడా ఇదే సంప్రదాయం ఉంటుంది. ఏజ్ పెరిగిన హీరోయిన్స్ బోల్డ్ గా నటించడానికి సిద్ధంగా ఉంటారు. దీంతో వాళ్ళ కెరీర్ మరికొన్నాళ్లు ముందుకు సాగుతుంది. తమన్నా కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తుంది.
తాజాగా విడుదల అవుతున్న ఈ రెండు సినిమాలు కనుక మంచి విజయాలు సాధిస్తే తమన్నా కెరీర్ కి మరో రెండు మూడేళ్లు ఢోకా లేదని చెప్పాలి. ఇప్పటికే వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మిల్క్ బ్యూటీ ఈ సినిమాల తర్వాత భారీ ప్రాజెక్ట్స్ తనకు వస్తాయనే నమ్మకం తో ఉంది. అదే విధంగా కొన్ని భారీ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయటానికి ఈ అమ్మడు సిద్ధంగా ఉంది.
జైలర్ సినిమాలో తమన్నా చేసిన నువ్వు .. కావాలయ్యా అనే సాంగ్ తో సినిమా కి ఊహించని రేంజ్ లో క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి స్టార్ మెటీరియల్ తమన్నా సొంతం. జైలర్ సినిమాలో తనది చిన్న రోల్ అని తెలిపిన తమన్నా, భోళా శంకర్ మూవీ లో మాత్రం మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేసి తమన్నా కెరీర్ కి బూస్ట్ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.