తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. రికార్డుల వేట మొదలవుతుంది. అలాంటి కోవాకి చెందిన హీరోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆయన చేసిన సినిమాలు ఆయనను టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి..కెరియర్ స్టార్టింగ్ లోనే వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఘనత కూడా తనకే దక్కింది. పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరంలో జనసేన పార్టీ పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికి సినిమాలను మాత్రం వదలడం లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతను కొనసాగిస్తున్నాడు. అలాగే సినిమాలను సైతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ రెండు పడవల ప్రయాణం లో తను ఎక్కడ కూడా తడబడకుండా ముందుకు సాగుతుండటం విశేషం… గత సంవత్సరం ‘ఓజీ’ సినిమాతో భారీ రికార్డులను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?
అయితే ఈ సినిమాను రీసెంట్ గా రాజమౌళి కి చూపించారట. ఆయన ఈ సినిమాను చూసి తన ఫస్ట్ రివ్యూ ని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది… తన ఫస్ట్ రివ్యూ లో ఏం చెప్పారట అంటే ఈ సినిమా గబ్బర్ సింగ్ సినిమాను మించి ఉందని దానికి మించిన బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారట. దీంతో సినిమా యూనిట్ మొత్తం ఆనందంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.
రాజమౌళి కే ఎందుకని మొదట ఈ సినిమాని చూపించారు అంటే రాజమౌళి పవన్ కళ్యాణ్ సినిమాని అందరికంటే ముందు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని హరీష్ శంకర్ తో గతంలో చెప్పారట. ఇక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి రాజమౌళిని పిలిపించి ఆ సినిమా చూపించారు.
మొత్తానికైతే రాజమౌళి ఈ మూవీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళి ఇచ్చిన రివ్యూ తో హరీష్ శంకర్ సైతం కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈనెల 19వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…